సీఎం హోదాలో అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్!
న్యూడిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డుల్లోకెక్కారు.
అయితే, ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అనంతరం అరెస్టయ్యారు. ఆ జాబితాను పరిశీలించినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఓం ప్రకాశ్ చౌతాలా, మధు కోడా, ఇటీవల హేమంత్ సోరెన్ వంటి నేతలు మాజీ సీఎంలుగా అరెస్టయ్యారు. అయితే, అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

కాగా, తాజాగా, మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ను సీజ్ చేశారు.
తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ను దాదాపు రెండు గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై సమాచారాన్ని ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు గల కారణాలను కూడా పేర్కొన్నారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ మంత్రులు, ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం రాత్రే విచారించాలని కోరారు. కానీ, శుక్రవారం ఉదయం ఈ అంశంపై విచారించే అవకాశం ఉంది.
మరోవైపు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్ష పార్టీల నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చివరకు ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇండియా కూటమిని బలహీనపర్చేందుకే ఈ అరెస్టులని మండిపడ్డారు. మరోవైపు, ప్రియాంక గాంధీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications