షాక్: స్కామ్లో కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రూ.50 కోట్ల కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ కుమార్ను సిబిఐ అరెస్టు చేసింది. కంప్యూటర్ల కొనుగోలులో రూ.50 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఆ అరెస్టు జరిగింది.
ఆ కుంభకోణంలో కీలక పాత్రధారి రాజేందర్ కుమార్ అనే ఆరోపణలు వచ్చాయి. టెండర్లను ఆహ్వానించకుండా కంపెనీలను స్థాపించడదానికి వర్క్ కాంట్రాక్ట్లు ఇచ్చాడనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దాని వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది.

ఈ కుంభకోణం 2006కు సంబంధించింది. ఐటి సొల్యూషన్స్, సాఫ్ట్వేర్లను అందించడానికి ఎండీవరస్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీని రాజేందర్ కుమార్ స్థాపించాడని ఆరోపణలున్నాయి. టెండర్లతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పనులను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆ కంపెనీ పొందింది.
రాజేందర్ కుమార్ 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆయన ఫిబ్రవరిలో నియమితులయ్యారు. రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన పదవిలో నియమితులయ్యారు. కేజ్రీవాల్తో పాటు రాజేందర్ కుమార్ ఐఐటిలో చదివినట్లు సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications