జయ ‘అమ్మ’కు అక్షింతలు వేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులు ధైర్యంగా విమర్శలు ఎదుర్కోవాలని సూచించింది.
అంతే కాని ప్రతి విమర్శకు కేసులు పెట్టడం మంచిపద్దతి కాదని సుప్రీం కోర్టు హితవు పలికింది. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.
తనను విమర్శించిన వారి మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువు నష్టం కేసులు పెట్టారు. గత ఐదు సంవత్సరాల్లో దాదాపు 200కు పైగా పరువు నష్టం కేసులు నమోదు అయ్యాయి.
అందులో మీడియా మీద 55 కేసులు, తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకుల మీద 85 కేసులు నమోదు అయ్యాయి. ఇలా నిత్యం పరువునష్టం కేసులు నమోదు చేసుకుంటూ వెళితే ఎలా ? అంటూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.