బీజేపీ, కాంగ్రెస్పై ఒంటికాలిపై లేచిన అసద్, ఎస్పీని కూడా (పిక్చర్స్)
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల పైన నిప్పులు చెరిగారు.
హైదరాదులోని దారుషిఫాలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన ఆ రెండు పార్టీల పైన మండిపడ్డారు. బాబ్రీ మసీదును కూల్చివేసి డిసెంబర్ 6 నాటికి 22 ఏళ్లు పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో అసద్ మాట్లాడారు. ఆయన కాంగ్రెస్, బీజేపీలతో పాటు సమాజ్వాది పార్టీలను కూడా టార్గెట్ చేశారు.
అసదుద్దీన్
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల పైన నిప్పులు చెరిగారు.
అసదుద్దీన్
హైదరాదులోని దారుసలేంలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన ఆ రెండు పార్టీల పైన మండిపడ్డారు. బాబ్రీ మసీదును కూల్చివేసి డిసెంబర్ 6 నాటికి 22 ఏళ్లు పూర్తవుతుంది.
అసదుద్దీన్
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో అసద్ మాట్లాడారు. ఆయన కాంగ్రెస్, బీజేపీలతో పాటు సమాజ్వాది పార్టీలను కూడా టార్గెట్ చేశారు.
అసదుద్దీన్
మజ్లిస్ పార్టీ క్రమంగా బలపడుతుండటం సోకాల్డ్ కమ్యూనల్ పార్టీలకు మింగుడు పడటం లేదని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
అసదుద్దీన్
రాజా మహేంద్ర ప్రతాప్ అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి భూమిని ఇచ్చారని బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.
అసదుద్దీన్
బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నిజాం ప్రభువు కూడా రూ.లక్ష ఇచ్చారని, అక్కడ కూడా ఆయన పుట్టిన రోజు వేడుకలు చేస్తారా అన్నారు.
అసదుద్దీన్
తమ పార్టీ పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పోటీ చేస్తుందని చెప్పారు. మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పైన అసద్ మండిపడ్డారు.