రాజస్థాన్లోనూ మణిపూర్ తరహా ఘటన: ప్రశ్నించిన మంత్రిని తొలగించిన సీఎం అశోక్ గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి రాజేంద్ర సింగ్ గూఢాను తొలగించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మంత్రిని తొలగించాలంటూ సీఎం చేసిన సిఫార్సును రాజస్థాన్ గవర్నర్ శుక్రవారం ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూఢా విమర్శించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
మణిపూర్ హింసాకాండపై తన సహోద్యోగులు నినదించినప్పటికీ.. మహిళలపై నేరాలను పరిష్కరించడంలో తన స్వంత ప్రభుత్వం విఫలమైందని.. ముందు తమను తాము నిందించుకోవాలని రాజేంద్ర గూఢ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023పై చర్చ జరుగుతున్న సమయంలో మణిపూర్ హింసపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు.

అయితే రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలపై తన స్వంత ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు రాజేంద్ర గూఢ. రాజస్థాన్లో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మణిపూర్ అంశాన్ని లేవనెత్తే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో రాజేంద్ర గూఢా స్పష్టం చేశారు.
మరోవైపు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉందంటూ ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజస్థాన్లో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల వాస్తవికతను కేబినెట్ మంత్రి రాజేంద్ర గూడా స్వయంగా వెల్లడించారని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ప్రకారం, మంత్రివర్గం సమిష్టి బాధ్యత ఆధారంగా పనిచేస్తుందని, మంత్రి స్థితిని మొత్తం కేబినెట్గా పరిగణిస్తారని రాథోడ్ తర్వాత ట్వీట్ చేశారు.
राजस्थान में बहन-बेटियों के ऊपर हो रहे अत्याचारों व दुष्कर्म की असलियत स्वयं सरकार के मंंत्री राजेन्द्र गुढ़ा जी बता रहे हैं। संविधान के आर्टिकल 164(2) के अनुसार मंत्रिमंडल सामूहिक उत्तरदायित्व के आधार पर काम करता है और एक मंत्री का बयान पूरे मंत्रिमंडल यानी सरकार का माना जाता… pic.twitter.com/QgpT5b31nv
— Rajendra Rathore (@Rajendra4BJP) July 21, 2023
రాజస్థాన్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, దానికి బాధ్యత వహించాలని ఆ రాష్ట్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కోరారు. కాగా, నిజాన్ని అంగీకరించే ధైర్యం తనకు లేదని.. అందుకే సీఎం అశోక్ గెహ్లాట్ ఆ మంత్రిని తొలగించారని భారతీయ జనతా పార్టీ విమర్శించింది.
#WATCH | Rajasthan Minister & Congress leader Rajendra Singh Gudha says, "It is true & should be accepted that we have failed in women's safety. Instead of Manipur, we should look within ourselves that atrocities on women have increased in Rajasthan."
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 21, 2023
(Source: Rajasthan… pic.twitter.com/uwStRuzmju
'గెహ్లాట్ పాలనలో నిజం మాట్లాడడం నిషిద్ధం.. నిజాన్ని అంగీకరించే ధైర్యం సీఎంకు లేదు! అసెంబ్లీలో తన మంత్రి రాజేంద్ర గూఢాజీ నిజాలు చెప్పినప్పుడు గెహ్లాట్కు బాధగా అనిపించి ఆయన్ను పదవి నుంచి తప్పించారు. మీరు నిజాలు మాట్లాడితే మిమ్మల్నేం వదిలిపెట్టరు' అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ వేదికగా వ్యాఖ్యానిచారు.
మణిపూర్ లాంటి ఘోరం రాజస్థాన్లోనూ
కరౌలిలోని తోడభీమ్ ప్రాంతంలోని మోహనపురాకు చెందిన దళిత యువతిని జూలై 13న కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేసి బావిలో పడేశారు. ఆమె శరీరంలో యాసిడ్ కాలిన గాయాలు కూడా ఉన్నాయి. అయితే, మరణానికి కారణం తుపాకీ గాయమేనని పోస్ట్మార్టం నివేదిక వెల్లడించింది. వెనుకబడిన తరగతుల ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి గెహ్లాట్ ప్రభుత్వం ధ్వజమెత్తారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications