కూతురిపై తండ్రి అత్యాచారం భార్య ఏం చేసిందంటే...
కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి వావి వరుసలు మరిచి కూతురిపై అత్యాచారం చేశాడు. అయితే దీన్ని సహించలేని భార్య ... భర్తను హత్య చేసింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకొంది.
డిస్పూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి వావి వరుసలు మరిచి కూతురిపై అత్యాచారం చేశాడు. అయితే దీన్ని సహించలేని భార్య ... భర్తను హత్య చేసింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకొంది.
అస్సాం రాష్ట్రంలోని లక్ష్మీపుర్ జిల్లాలోని నౌబోయిచా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొంది.గ్రామానికి చెందిన మణిక్ నారా అనే 45 ఏళ్ళ వ్యక్తికి జునాకి అనే మహిళతో 24 ఏళ్ళ క్రితం వివాహమైంది.

వీరికి 19 ఏళ్ళ కూతురు కూడ ఉంది. అయితే కూతురిపై పలుమార్లు భర్త మణిక్ నారా అత్యారానికి పాల్పడ్డాడు. అంతే కాదు తరచుగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని జునాకి గుర్తించింది.
ఆదివారం నాడు మణిక్ నారాను పదునైన కత్తితో దారుణంగా పొడిచి చంపేసింది. రక్తపుగాట్లతో ఊరిపొలాల్లో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు మృతదేహన్ని స్వాధీనపర్చుకొని విచారణ చేపట్టారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనపర్చుకొని విచారణ చేపట్టారు. విచారణలో తనే హత్య చేసినట్టు జునాకి ఒప్పుకొందని పోలీసులు ప్రకటించారు. ఈ హత్యలో మరో ఇద్దరు పాల్గొన్నారని సమాచారం. అయితే మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications