మీరట్లో విచిత్రం: అతని వయస్సు 747 ఏళ్లు, రచనది 549!
మీరట్: మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ (ఎంసీబీ) ప్రకారం... నగరంలో అత్యధిక పెద్ద వయస్కుడు గల ఓటరు హరిసింగ్! ఆయన వయస్సు 747 ఏళ్లు! మే 17వ తేదీన ఎంసీబీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఓటర్ల లిస్ట్ను ప్రిపేర్ చేసింది.
ఈ లిస్ట్లో హరిసింగ్ వయస్సు 747గా పేర్కొన్నారు. హరిసింగ్ మీరట్ పరిధిలోని సుభాష్ నగర్లోని ఉంటున్నాడు. మరోచోట ఓ కొడుకు వయస్సును 112 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఆయన తండ్రి వయస్సు 72 సంవత్సరాలు అని రాశారు.
బంగ్లా ప్రాంతంలో నివసించే రచన, అరుణ త్రివేది అనే వారి వయస్సును 549, 550గా పేర్కొన్నారు. ప్రేమ్ చంద్ అనే ఎంఈఎస్ కాలనీ వ్యక్తి వయస్సును 545 ఏళ్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు, మీరట్లో పలువురి వయస్సును 200 నుండి 700 ఏళ్ల వరకు పేర్కొన్నారు. అయితే, ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఓటరు కార్డుల్లో తప్పుల సవరణ జరుగుతోంది. అన్ని తప్పులను సరి చేస్తామని అధికారులు చెప్పారు.