వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోయలో పడిన బస్సు: 35 మంది సజీవ దహనం?
భోపాల్: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో పన్నా నుంచి ఛతర్పూర్ వెళ్తున్న ఓ బస్సు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో బస్సు డిజీల్ ట్యాంక్ పగిలిపోయి పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే మొత్తంగా ఎంతమంది చనిపోయారనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 550 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఎంత మంది చనిపోయారనేది అధికారికమైన ప్రకటన ఏదీ వెలువడలేదు.
Comments
English summary
At least 35 people are feared dead after a bus fell down from a culvert and caught fire in Madhya Pradesh's Panna district on Monday afternoon, about 550 km away from the capital Bhopal.