మణిపూర్లో కొత్త సమస్య పుట్టుకొచ్చింది..!!
న్యూఢిల్లీ: మణిపూర్లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మే 3వ తేదీన మణిపూర్లో మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు.

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.
ఈ పరిస్థితుల్లో ఉన్న మణిపూర్లో మరో కొత్త సమస్య పుట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. క్రమంగా అక్కడ ఆహార సంక్షోభం నెలకొంటోంది. వ్యవసాయ పనులు అక్కడ స్తంభించిపోయాయి. మెజారిటీ గ్రామాలన్నీ కూడా నిరంతర కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు, పోలీసుల పహారాలో ఉంటోన్నాయి. స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తోన్నారు. స్వేచ్ఛగా తిరుగాడలేని పరిస్థితులు నెలకొన్నాయి.
దీని ప్రభావం వ్యవసాయ పనులపై పడింది. మణిపూర్ గ్రామాల్లో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు పొలం పనులకు వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటోన్నారు. సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతోన్నప్పటికీ.. అరక దున్నడానికి మణిపూర్ రైతులు సాహసించలేకపోతున్నారు.

మణిపూర్ వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 149 గ్రామాల్లో కనీసం 5,127 హెక్టార్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. వ్యవసాయ పనులు స్తంభించిపోవడం వల్ల జూన్ వరకు 15,437.23 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నిలిచిపోయింది. బిష్ణుపూర్ జిల్లాలో 2,191 హెక్టార్ల భూమి సాగుకు నోచుకోలేదు.
ఈ పరిస్థితులను సమీక్షించడానికి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల కోసం విత్తనాలు, ఎరువులు, సాగునీటి వసతి, విద్యుత్ సరఫరా.. ఇలా అన్నీ అందుబాటులో ఉంచినప్పటికీ- రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో దిగడానికి భయపడుతున్నారని పేర్కొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications