Aunty: పక్కింటి ఆంటీ మీద కన్నుపడింది. భర్త లేడని ఇంజనీర్ ఏం చేశాడంటే ?, షేమ్ !
చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి జీవిస్తోంది. భర్త వ్యాపారం నిమిత్తం ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటున్నది. కొడుకు వయసు ఉన్న పక్కింటి యువకుడు ఆంటీ మీద కన్ను వేశాడు. ఆంటీతో అనుచితకంగా ప్రవర్థిస్తూ ఆమెను అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను వస్తాను నువ్వు ఇస్తావా అని అడిగాడు. మహిళకు మండిపోయి యువకుడి తల్లికి మ్యాటర్ చెప్పింది. అయినా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడిలో ఎలాంటి మార్పు లేదు. పెళ్లికి వెళ్లి అలసిపోయి ఇంటికి వెళ్లి నిద్రపోతున్న మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆంటీ ఎదురు తిరగడంతో ఆమెను కిందకు పడేసి గొంతు మీద కాలు వేసి తొక్కడంతో ఆమె స్పృహ తప్పింది. మహిళ మీద అత్యాచారం చేసిన నిందితుడు పరారైనాడు. అయితే గొంతు మీద బలంగా కాలు వేసి తొక్కడంతో ఆంటీ ప్రాణం పోయింది.

ఆంటీ మీద కన్నుపడింది
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 48 ఏళ్ల మహిళ ఇంటి పక్కనే ఎడ్విన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎడ్విన్ వివాహిత మహిళ మీద కన్ను వేశాడు. మహిళ భర్త ఎక్కువగా బయటి ప్రాంతాల్లో నివాసం ఉండటంతో ఎడ్విన్ ఆంటీని పలుమార్లు వేధింపులకు గురి చేసి ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.

యువకుడి తల్లికి మ్యాటర్ చెప్పిన ఆంటీ
ఎడ్విన్ తీరుతో విసిగిపోయిన ఆంటీ కామాంధుడు ఎడ్విన్ తల్లికి, స్థానికంగా నివాసం ఉంటున్న పెద్దలకు ఫిర్యాదు చేసింది. వారు ఎడ్విన్ను మందలించి మర్యాదగా ఉండటకపోతే నీకథ చూస్తామని హెచ్చరించారు. దీంతో ఆంటీ మీద ఎడ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నీ అంతు చూస్తానని రెండుమూడు సార్లు హెచ్చరించాడని తెలిసింది.

పెళ్లికి వెళ్లి వచ్చిన మహిళ
ఈనెల 13వ తేదీన ఆ మహిళ తన బంధువుల్లో ఒకరి పెళ్లి వేడుకకు వెళ్లింది. పెళ్లి వేడుకలు పూర్తి చేసుకున్న మహిళ ఇంటికి వెళ్లి అలసిపోవడంతో నిద్రపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది. తరువాత మహిళ ఇంటి వెనుక నుంచి ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఎడ్విన్ మహిళపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. దీంతో షాక్కు గురైన మహిళ కేకలు వేసింది.

స్పృహలో లేని మహిళపై అత్యాచారం
దీంతో కోపోద్రిక్తుడైన ఎడ్విన్ ఆంటీ మీద దాడి చేసి ఆమెను కిందకు వేసి ఆమె మెడపై కాలుతో గట్టిగా తొక్కాడు. మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆ తరువాత స్పృహలోని మహిళ మీద అత్యాచారంచేసిన కామాంధుడు ఎడ్విన్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొన్ని గంటల తరువాత ఇరుగుపొరుగు వారు మహిళ ఇంటికి వెళ్లడంతో అసలు మ్యాటర్ తెలిసింది. తరువాత ఎడ్విన్ తనకేమీ తెలియదు అనట్లు నటిస్తూ వారితో పాటు ఆంటీ ఇంటికి వెళ్లాడు.

ఆసుపత్రిలో మహిళ
తీవ్రంగా గాయపడిన మహిళను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎడ్విన్ తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి పక్కింటి మహిళ మీద ఎవరో దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఎడ్విన్ ఈ ఘటనకు పాల్పడ్డాడని తేలింది. అనంతరం పోలీసులు ఎడ్విన్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందింది.

మహిళ ప్రాణం పోయింది
చివరికి నాగర్కోయిల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనంతరం పోలీసులు దాడి కేసును హత్య కేసుగా మార్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రేప్ చెయ్యడానికి వెళ్లిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఎడ్విన్ ఆంటీ మీద అత్యాచారం చేసి చంపేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications