Aunty: అత్తా VS కోడలు, బెడ్ రూమ్ లో జాకెట్ తో ?, భర్త ఫుల్ సపోర్ట్, పడక సుఖం కోసం కొడుకు ?
ముంబాయి/పూణే/చెన్నై: సర్వసాధారణంగా చాలా ఇళ్లలో చిన్నచిన్న విషయాలకు అత్తా కోడలు గొడవపడటం మనం చూస్తూనే ఉంటాము. ఓ ఇంట్లో అత్తా కోడలు నువ్వా ?, నేనా ? అంటూ గొడవపడ్డారు. సీక్రెట్ విషయాల్లో వీరి గొడవలు ఎక్కడికెక్కడికో దారితీశారు. పెళ్లాం మోజులో పడిన కొడుకు అమ్మకు మద్దతుగా మాట్లాడకుండా వెనుక నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసేయ్, నేను చూసుకుంటాను అంటూ భార్యకు పంప్ కొట్టాడు. భార్య తనను బెడ్ రూమ్ లోకి రానివ్వదని భర్తకు భయం. భర్త సపోర్టుతో రెచ్చిపోయిన భార్య ఆమె అత్తను జాకెట్ ప్లాన్ తో చంపేసింది. శవాన్ని మూడు రోజులు ఇంటి టెర్రాస్ మీద దాచి పెట్టారు. దుర్వాసన ఎక్కువ కావడంతో కొడుకు, కోడలు ఇద్దరూ కలిసి శవాన్ని గోనె సంచిలో నీట్ గా ప్యాక్ చేసి తీసుకెళ్లి విసిరేసి చేతులు దులుపేసుకున్నారు. పక్కింటి అంకుల్ కు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీటీవీ కెమెరాల్లో మొత్తం భాగోతం బయటపడటం కలకలం రేపింది.
Aunty: వయ్యారంగా ఉందని వల, లాభం లేదని బెడ్ రూమ్ లో దూరి ?, అక్కా, చెల్లి, భర్త కాశ్మీర్ లో ?
22 ఏళ్లకే కోడలు కిలాడి
మహారాష్ట్రలోని పూణే సిటీ శివార్లలోని తలేగావ్ సమీపంలోని దభడే ప్రాంతంలో బేబీ గౌతమ్ షిండే (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. బేబీ షిండే కుమారుడు మిలింద్ గౌతమ్ షిండే. గత ఏడాది మిలింద్ గౌతమ్ షిండే పూజా మిలింద్ షిండే (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పూజాకు 22 ఏళ్లలోనే కిలాడీ తెలివి చాలా ఎక్కువగా ఉందని సమాచారం.
చలాకి అత్తా VS కిలాడీ కోడలు
పెళ్లి జరిగిన కొన్ని రోజులకే మిలింద్ అతని భార్య పూజాకు దాసోహం అయిపోయాడు. భార్య పూజా మత్తులో ఉన్న మిలింద్ కు అతని తల్లి చేదు అయ్యింది. అందరి ఇళ్లలో ఉన్నట్లే రానురాను అత్తా బేబి షిండే, కోడలు పూజాకు చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. అత్తాకోడళ్ల గొడవ రానురాను పెద్దవి అయ్యాయి.
నువ్వు ఏమైనా చేసుకో.... నేను చూసుకుంటాను
పెళ్లాం పూజా మోజులో పడిన కొడుకు మిలింద్ షిండే అమ్మ బేబి షిండేకి మద్దతుగా మాట్లాడకుండా వెనుక నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసేయ్, నేను చూసుకుంటాను అంటూ భార్య పూజాకు పంప్ కొట్టాడు. భార్య పూజా తనను బెడ్ రూమ్ లోకి రానివ్వదని భర్త మిలింద్ కు భయం పట్టుకునింది. ఎప్పుడు తల్లి బేబీ షిండే ముందు నోరు తెరవకుండా వెనుక భార్య పూజకు ఆమె భర్త మిలింద్ వంతపాడుతూ వచ్చాడు.
అత్తను చంపేసిన కిలాడీ కోడలు
మే 21వ తేదీన అత్త బేబీ షిండే, కోడలు పూజా ఇంట్లో తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ సమయంలో మాటామాటా పెరిగింది. తరువాత సహనం కోల్పోయిన పూజా తాను ఏమి చేసినా నా భర్త మిలింద్ నాకు తోడు ఉంటాడని రెచ్చిపోయి అత్త బేబీని పట్టుకుని చితకబాదేసింది. తరువాత బెడ్ రూమ్ లో అత్తను మంచం మీద పడేసిన పూజా జాకెట్ తీసుకుని ఆమె గొంతు బిగించి దారుణంగా చంపేసింది.
ఇంటి టెర్రాస్ లో మూడు రోజులు అత్త శవం
ఇంటికి వచ్చిన భర్త మిలింద్ కు మీ అమ్మ బేబీని చంపేశానని పూజా చాలా కూల్ గా చెప్పింది. చంపేస్తే చంపేశావులే, పీడపోయింది అంటూ మిలింద్ కూడా తల్లి హత్యను చాలా లైట్ గా తీసుకున్నాడు. బేబీ షిండే శవాన్ని ఆమె కొడుకు మిలింద్, కోడలు పూజా ఇంటి టెర్రాస్ మీద దాచిపెట్టారు. మూడు రోజుల తరువాత బేబీ శవం కుళ్లిపోవడంతో దుర్వాసన రావడం మొదలైయ్యింది.
పోలీసుల భయంతో ?
దుర్వాసన వస్తే చుట్టుపక్క వాళ్లకు తెలిసిపోయి పోలీసు కేసు అవుతుందని పూజా, ఆమె భర్త మిలింద్ భయపడ్డారు. పెద్ద గోనే సంచి తీసుకు వచ్చి బేబీ శవాన్ని అందులో నీట్ గా ప్యాక్ చేశారు. బేబీ శవాన్ని ఆమె కొడుకు మిలింద్, కోడలు పూజా కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కాలనీ సమీపంలోని నిర్జనప్రదేశంలోని ముళ్ల పొదల్లోని చెత్తలో విసిరేశారు.
Recommended Video
ఆంటీ ఫ్రెండ్ అంకుల్ కు డౌట్ వచ్చింది
హత్యకు గురైన బేబీ ఇంటి పక్కన నివాసం ఉంటున్నన ఓ అంకుల్ కు డౌట్ వచ్చింది. మూడు రోజుల నుంచి బేబీ ఎందుకు కనపడటం లేదని అనుమానం వచ్చింది. అంతకు ముందు రోజు పూజా, ఆమె భర్త మిలింద్ అనుమానాస్పదంగా గోనె సంచె తీసుకెళ్లడం అతను చూశాడు. వెంటనే ఆ అంకుల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సీసీటీవీ కెమెరాల్లో పిన్ టూ పిన్
పోలీసులు పూజా, ఆమె భర్త మిలింద్ కు తెలీకుండా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. పూజా, ఆమె భర్త మిలింద్ అనుమానాస్పదంగా గోనె సంచి తీసుకెళ్లి విషయం గుర్తించారు. పూజా, మిలింద్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే బేబీ షిండ్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అయితే బేబీని ఆమె కోడులు పూజా ఎందుకు హత్య చేసింది ? అనే విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారని ది న్యూ ఇండియన్ ఎక్సెప్రెస్ పత్రిక కథనం ప్రచురించింది,