వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని చంపేందుకు అబూ జిందాల్ కుట్ర : వాస్తవమేన్న ముంబై కోర్టు

|
Google Oneindia TeluguNews

ముంబై : 2002లో గుజరాత్ అల్లర్ల తరువాత అప్పట్లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని అలాగే విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాలను హత్య చేసేందుకు కుట్ర జరిగిన మాట వాస్తవమేనని పేర్కొంది ముంబై మోకా కోర్టు (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్).

అబూ జిందాల్ అలియాస్ సయ్యద్ జుబేదిన్ అన్సారీ ఈ హత్యలకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై విచారణ జరిపిన ముంబై మోకా కోర్టు విషయాన్ని ధృవీకరించింది. ఆరోపణలు వాస్తవమేనని మోడీ, తొగాడియాల హత్యకు అబూ జిందాల్ కుట్ర పన్నాడని తెలిపింది.

Aurangabad Arms Haul Case: Abu Jundal conspired to kill Narendra Modi, others after 2002 Gujarat riots, says Court

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిందితులుగా భావించలేమని, ప్రధాన నిందితుడు అబూ జిందాల్ తో పాటు మరో వ్యక్తి మాత్రమే కుట్రతో సంబంధం కలిగి ఉన్నాడని కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులను, 3200 బుల్లెట్లను తరలిస్తూ ఏటీఎస్ పోలీసులకు కంటపడ్డ జిందాల్, వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యాడు.

అనంతరం మాలేగావ్ మకాం మార్చిన జిందాల్, అక్కడి నుంచి బంగ్లాదేశ్ కు తర్వాత పాక్ కు పారిపోయాడు. అయితే 2012లో సౌదీ అరేబియాలో మళ్లీ పట్టుబడడంతో.. సౌదీ ఇండియా మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అబూ జిందాల్ అతని సహచరి మోనికా బేడీలను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Abu Jundal alias Syed Zaibuddin Ansari, who was the handler in 26/11 terror attacks, was hatching a plan to eliminate Prime Minister Narendra Modi, who was then the Chief Minister of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X