రోజుకు 82 మంది హత్య.. 11 కిడ్నాప్లు.. ఎన్సీఆర్బీ నివేదిక
దేశంలో క్రైం రేటు పెరుగుతోంది. హత్యలు, కిడ్నాప్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదించింది. దేశవ్యాప్తంగా రోజు 82 మంది చనిపోతున్నారని రిపోర్ట్ చేసింది. 11 కన్నా ఎక్కువ కిడ్నాప్ అవుతున్నారట. జార్ఖండ్లో లక్ష మందిలో ఒకరు హత్యకు గురవుతున్నారు. ఢిల్లీలో కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతున్నాయి.
2021లో మొత్తం 29, 272 హత్యలు జరిగాయి. గతేడాది కన్నా 0.3 శాతం తగ్గాయి. గతేడాది 29, 193 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చేసింది. 2021లో లక్ష వెయ్యి 707 కేసులు నమోదయ్యాయి. 2020లో 84 వేల 805 కేసులు వచ్చాయి. అంటే 19.9 శాతం కేసులు వచ్చాయి. ఆ ఏడాది లక్ష మందిని కాపాడారు.

ఉత్తరప్రదేశ్లో 3717 కేసులు.. బీహర్ో 2799 కేసులు, మహారాష్ట్ర 2330 కేసులు, మధ్యప్రదేశ్ 2034 కేసులు, పశ్చిమ బెంగాల్ 1884 మంది చనిపోయారు. ఢిల్లీలో 459.. ఎన్సీఆర్సీబీ పరిధిలో 478 మంది చనిపోయారు.
2021లో హత్య కేసుల్లో 9765 వివాదాలు.. 3782 కేసులు వ్యక్తిగతంగా పగ, శత్రుత్వం, లాభం కోసం 1692 కేసులు ఉన్నాయి. హత్యల విషయంలో లక్ష మందికి జార్ఖండ్లో 1573 కేసులు, అండమాన్ నికోబార్ దీవుల్లో 16 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో హత్యకు సంబంధించి నేరాల రేటు 2.2 శాతంగా ఉంది. కిడ్నాప్ గురయిన కేసుల్లో 17,605 మంది పురుషులు, 86,543 మంది మహిళలు ఉన్నారు. ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications