Axis My India exit polls: త్రిపురలో మరోసారి బీజేపీ హవానే
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరగా సోమవారం నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. దీంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పార్టీల మధ్య హోురాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వామపక్షాల కూటమికి 6-11 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీఎంసీకి 9-16 స్థానాల్లో గెలుచుకుంటుందని పేర్కొంది.

మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీకి 36-45 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి త్రిపురలో బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications