Ayodhya: ఓవైసీ పోస్టర్లు తగలబెట్టిన అయోధ్య అర్చకుడు. పద్దతి మార్చుకోకపోతే నిజంగా తగలబెట్టేస్తాం!
అయోధ్య/లక్నో/హైదరాబాద్: మతఘర్షణలు జరగడానికి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు, ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ పోస్టర్లను అయోధ్యలోని ఓ అర్చకుడు తగలబెట్టడం కలకలం రేపింది. ప్రజలను రెచ్చగొడుతున్న మీ పోస్టర్లు మాత్రమే ఇప్పుడు కాల్చి బూడిద చేశాము. ఇలాగే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న దేశ విద్రోహశక్తులను నిజంగానే తగలబెట్టాస్తామని అయోధ్యలోని తపస్వి భావని దేవాలయం అర్చకుడు పరమహంస దాస్ హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
విషయం తెలుసుకున్న అయోధ్య పోలీసులు రంగంలోకి దిగారు. అసాదుద్దీన్ ఓవైసీతో పాటుకొందరు దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అయోధ్య అర్చకుడు పరమహంస దాస్ ఆరోపిస్తున్నారు.
ఓవైసీ హద్దుమీరుతున్నారు
ఎంఐఎంఐఎం లీడర్ అసాదుద్దీన్ ఓవైసీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది సమాజానికి చేటుకలిగిస్తుందని అయోధ్యలోని తపస్వి భావని దేవాలయం అర్చకుడు పరమహంస దాస్ ఆరోపించారు. అసాదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఉగ్రవాద వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుందని, తరువాత పరిస్థితులు వేరుగా ఉంటాయని అయోధ్యలోని తపస్వి భావని దేవాలయం అర్చకుడు పరమహంస దాస్ హెచ్చరించారు.
మిమ్మల్ని నిజంగానే తలబెట్టేస్తారు జాగ్రత్త!
ప్రజలను రెచ్చగొడుతున్న మీ పోస్టర్లు మాత్రమే ఇప్పుడు కాల్చి బూడిద చేశాము. ఇలాగే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న దేశ విద్రోహశక్తులను నిజంగానే తగలబెట్టాస్తామని అయోధ్యలోని తపస్వి భావని దేవాలయం అర్చకుడు పరమహంస దాస్ హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
రాహుల్ గాంధీ, ప్రియాంకల మీద ఫైర్
మతఘర్షణలు జరగడానికి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు, ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ పోస్టర్లను అయోధ్యలోని ఓ అర్చకుడు పరమహంస దాస్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న అయోధ్య పోలీసులు రంగంలోకి దిగి అర్చకుడు పరమహంస దాస్ ను అదుపులోకి తీసుకుని ఓవైసీ పోస్టర్ల మంటలు అదుపు చేశారు. అసాదుద్దీన్ ఓవైసీతో పాటుకొందరు దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అయోధ్య అర్చకుడు పరమహంస దాస్ ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక ఏం చేస్తున్నారు?
ఇదే సమయంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ రాష్ట్రంలో టైలర్ కన్హయ్య లాల్ హత్య జరిగితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉదయ్ పూర్ లో ఇంత వరకు అడుగుపెట్టలేదని అయోధ్య అర్చకుడు పరమహంస దాస్ మండిపడ్డారు.
టైలర్ కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా రాహుల్ గాంధీకి టైమ్ లేదని, ఆయన చాలా బిజీగా ఉన్నారని అయోధ్య అర్చకుడు పరమహంస దాస్ మండిపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.