ayodhya verdict:అయోధ్య తీర్పుపై అద్వానీ హర్షం, రథయాత్రతో తెరపైకి మందిర నిర్మాణం..
అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య భూ వివాదం సమసిపోయినట్టేనని పేర్కొన్నారు.
Ayodhya Verdict:కాలక్రమంలో అయోధ్య ,నాటి నుంచి నేటి వరకు (ఫోటోలు)
అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ జన్మభూమికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఐదెకరాల భూమి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత అద్వానీ స్పందించారు.
1990లో అయోధ్యలో రాముడి మందిరం కట్టాలని అద్వానీ రథయాత్ర చేపట్టారు. దీంతో అద్వానీ ప్రభ పెరిగిపోయింది. మందిర్ కట్టాలనే డిమాండ్ పెరిగింది. అద్వానీని బీహార్లో అప్పటి సీఎం లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయడంతో యాత్రకు బ్రేక్ పడింది.. కానీ మందిర నిర్మాణ డిమాండ్ ఆరంభమైంది. తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత.. అలహాబాద్ హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మించాలని అద్వానీ యాత్ర చేపట్టడంతోనే క్రేజీ వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని మేధావులు అభిప్రాయపడతారు. ఈ క్రమంలో తీర్పుపై అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.