మోడీ దావూద్ను కలిశారు: ఆజంఖాన్ సంచలనం
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ నిరుడు డిసెంబర్లో లాహోర్లో పర్యటించినప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను కలుసుకున్నారని సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ దావూద్ కలుసుకున్నట్లుగా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. దీంతో తీవ్ర కలకలం రేగింది.
పాకిస్తాన్ నవాజ్ షరీఫ్తో భేటీ అయిన సమయంలో మోడీ దావూద్ అక్కడే ఉన్నాడని ఆయన చెప్పారు. మోడీ ఖండిస్తే తాను రుజువులు చూపగలనని ఆయన అన్నారు. మోడీ నవాజ్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అనూహ్యంగా, ఆకస్మికంగా మోడీ పాకిస్తాన్ వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

మోడీ దావూద్ను కలిసినట్లు రుజువు చేసే ఫోటో కూడా చూపగలనని ఆయన అన్నారు. నవాజ్ షరీఫ్ తల్లిని మోడీ కలిసినప్పుడు అద్వానీ, జిందాల్ కూడా ఉన్నారని ఆయన అన్నారు. ఘాజీపూర్ జిల్లాలోని ఓ కళాశాల వార్షికోత్సవానికి వచ్చిన ఆజంఖాన్ మీడియాతో మాట్లాడారు.
ఆజం ఖాన్ వివాదాస్పద ప్రకటనలకు పెట్టింది పేరు. దాద్రీ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు దావూద్ మోడీ కలిశారంటూ ఆజం ఖాన్ చేసిన ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications