ఫ్లెష్ ట్రేడ్: బంగ్లా యువతిపై గ్యాంగ్రేప్, రైల్లో పడేశారు, 7గురిపై కేసు
థానే: మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన 20ఏళ్ల ఓ యువతిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టారు. అంతేగాక, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆమెను తీవ్రంగా కొట్టారు.
అనంతరం ఆమెను ఓ రైలు బోగీలో పడేశారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
బంగ్లాదేశ్లోని అభయ్నగర్కు బాధిత యువతిని ముంబైకి తీసుకొచ్చిన మిథున్ చక్రవర్తి అనే వ్యక్తి ఓ జిజుకు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె గత నాలుగేళ్ల నుంచి జిజు వద్దనే కళ్యాణ్ రైల్వేస్టేషన్కు సమీపంలోని ఓ మురికివాడలో ఉంటున్నట్లు చెప్పారు. భోపాల్ రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని కళ్యాణ్ పోలీసులు తెలిపారు.

జిజు, మరికొందరు ఆమెను వ్యభిచారం కూపంలోకి నెట్టారని చెప్పారు. మే 10న అర్ధరాత్రి ఆమెను కళ్యాణ్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆమెను పఠాన్కోట్ ఎక్స్ప్రెస్ రైలులో పడేసి పరారయ్యారు.
భోపాల్ రైల్వే స్టేషన్ చేరుకున్న ఆ రైలులో అపస్మారక స్థితిలో ఉన్న బాధిత యువతిని గుర్తించిన భోపాల్ పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మే 13న ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, ముంబై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కళ్యాణ్ రైల్వే పోలీసులకు ఆ కేసు బదిలీ చేయడం జరిగింది. ఏడుగురిపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు కళ్యాణ్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications