బెంగాల్లో దూసుకెళ్తున్న బీజేపీ, తృణమూల్ గెలిచినా..: సర్వేలో వెల్లడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆ పార్టీకి ఓ షాక్. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా ఓ సర్వేలో వెల్లడైంది.
ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినప్పటికీ బీజేపీ మాత్రం బాగా మెరుగుపడి, ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుందని ఏబీపీ ఆనంద సీ ఓటరు సర్వే అభిప్రాయ సేకరణలో తేలింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి మూడో స్థానం, కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలుస్తుందని వెల్లడైంది.
ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఒపినీయన్ పోల్ మేరకు తృణమూల్ 538, బీజేపీ 167, లెఫ్ట్ పార్టీ 73 జిల్లా పరిషత్లుగెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం ఉత్తర 24 పరగణాలు, నదియా, కూచ్ బేహార్ ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంది.