షిర్డీ బంద్: మూతపడ్డ హోటళ్లు, దుకాణాలు: సాయినాథుడి ఆలయంపై పుకార్లు..నమ్మొద్దు..!
ముంబై: మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. షిర్డీ సాయినాథుడి జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యల పట్ల షిర్డీవాసులు భగ్గుమంటున్నారు. నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. బంద్ను పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచీ షిర్డీలో ఏ ఒక్క హోటల్ కూడా తెరచుకోలేదు. హోటళ్లు మూత పడ్డాయి. దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు స్థానికులు.

షిర్డీని కాదని..
కోట్లాదిమంది భక్తులు కొలిచే సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదంటూ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పత్రిలో ఆయన జన్మించారని, ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలను మంజూరు చేస్తామంటూ ఆయన వెల్లడించారు. పర్బణీ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల షిర్డీవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిరవధిక బంద్..
ఇందులో భాగంగా- వారు షిర్డీ బంద్కు పిలుపునిచ్చారు. నిరవధిక బంద్కు దిగారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి బంద్ను పాటిస్తున్నారు. షిర్డీలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. హోటళ్లు, దుకాణాలు మూత పడ్డాయి. వాహనాల సంచారం రోజువారీ కంటే తగ్గింది. ఆటోలు, సెవెన్ సీటర్ల రాకపోకలు తగ్గిపోయాయి. ఇతర ప్రైవేటు వాహనాలేవీ రోడ్ల మీద తిరగట్లేదు. చిన్న, చిన్న దుకాణాలు కూడా మూత పడ్డాయి.

ఇబ్బందులను ఎదుర్కొంటున్న భక్తులు..
బంద్ ప్రభావం భక్తులపై తీవ్రంగా పడింది. బంద్ ఫలితంగా దేశం నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎటూ కదల్లేకపోతున్నారు. కొన్ని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ముందుకొచ్చినప్పటికీ.. బంద్ను పాటిస్తున్న వాహనాల యజమానులు వారిని అడ్డుకుంటున్నారు. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు బంద్ను విజయవంతం చేయడానికి తమవంతు కృషి చేస్తున్నారు.

యధాతథంగా ఆలయం
కాగా- సాయినాథుడి ఆలయంలో యథాప్రకారం పూజలు కొనసాగాయి. సాయిబాబాకు యధాతథంగా ప్రాతఃకాల పూజలను అర్చకులు నిర్వహించారు. భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచారు. బంద్ సందర్భంగా ఆలయాన్ని కూడా మూసివేస్తారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దీపక్ మధుకర్ ముగ్లికర్ తెలిపారు. సాయిబాబాను దర్శించడానికి భక్తులు రావచ్చని, ఆలయాన్ని మూసివేస్తారనే వార్తలను విశ్వసించవద్దని ట్రస్ట్ సభ్యుడు బీ వాక్ఛురే స్పష్టం చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications