అరెస్ట్ భయంతో బెంగళూరులో బ్యాంకు ఉద్యోగి సూసైడ్
సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.
బెంగళూరు: నల్లదనం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడనే ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని వివేక్ నగర్ కు చెందిన రవిరాజ్(55) అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచిలో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడు.

ఆదాయపన్ను శాఖ ఆధికారులు కూపీ లాగడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. అప్పటికే రవిరాజ్ 20 లక్షల రూపాయల వరకు రద్దైన నోట్ల స్థానంలో కొత్త రూ.2 వేల నోట్లు బయటికి పంపించినట్లు సమాచారం. ఈ విషయం గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు అతడ్ని వెంటనే సస్పెండ్ కూడా చేశారు.
ఇదే విషయమై సోమవారం బ్యాంకు అధికారులు అతడ్ని విచారణకు పిలిపించారు. అప్పటికే అవమాన భారంతో కుంగిపోయి ఉన్న రవిరాజ్ ఇక తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వివేక్ నగర్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications