వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్ట్ భయంతో బెంగళూరులో బ్యాంకు ఉద్యోగి సూసైడ్

సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నల్లదనం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడనే ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని వివేక్ నగర్ కు చెందిన రవిరాజ్(55) అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచిలో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడు.

Bank Employee Suicide in Bangalore

ఆదాయపన్ను శాఖ ఆధికారులు కూపీ లాగడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. అప్పటికే రవిరాజ్ 20 లక్షల రూపాయల వరకు రద్దైన నోట్ల స్థానంలో కొత్త రూ.2 వేల నోట్లు బయటికి పంపించినట్లు సమాచారం. ఈ విషయం గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు అతడ్ని వెంటనే సస్పెండ్ కూడా చేశారు.

ఇదే విషయమై సోమవారం బ్యాంకు అధికారులు అతడ్ని విచారణకు పిలిపించారు. అప్పటికే అవమాన భారంతో కుంగిపోయి ఉన్న రవిరాజ్ ఇక తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వివేక్ నగర్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
An employee of a State Bank of Mysore branch in Bengaluru committed suicide after he was suspended following allegations of money laundering. Raviraj, 55, who worked in the bank's cash management department, was found hanging in his residence in Viveknagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X