రూ. 50,000 రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు- గోల్డ్కు మినహాయింపు
Reserve Bank of India: చిన్న రుణ మొత్తాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయాలను తీసుకుంది. 50,000 రూపాయల వరకు ఉండే చిన్న రుణ మొత్తాలపై అధిక ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రాధాన్యత రంగాలు- ప్రత్యేకించి చిన్న మొత్తాల రుణాలపై దీన్ని వర్తింపజేసింది.
50,000 రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలకు సంబంధించిన లేదా తాత్కాలిక సేవా ఛార్జీలు గానీ,ఇతర తనిఖీ ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక భారం నుండి చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం, ఈ పాలసీని మరింత సరళీకరించడంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

50 వేల రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలపై ఎలాంటి లోన్-సంబంధిత తాత్కాలిక సేవ ఛార్జీలు/తనిఖీ ఛార్జీలు ఇకపై ఉండబోవని తెలిపింది. తాజా ఆదేశాలు- ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే.. 2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వస్తాయి.
ప్రాధాన్యత రంగ రుణాల కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి తీసుకున్న బంగారు ఆభరణాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వాటిని మినహాయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యాపార కార్యకలాపాల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునే వాళ్లు, రైతులు, బడుగు-బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందజేయడాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించినట్లు వివరించింది.
ఈ కొత్త పీఎస్ఎల్ మార్గదర్శకాల వల్ల బ్యాంకుల జావాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఈ గైడ్లైన్స్ ప్రకారం- ఒక ఆర్థిక సంవత్సరం త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లో, ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోగా ఈ పీఎస్ఎల్ రుణాలకు సంబంధించిన సమగ్ర డేటాను ఆర్బీఐకి అందజేయాల్సి ఉంటుంది.
ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని చెబుతున్నారు. జాతీయ, ప్రైవేట్ సెక్టార్లో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న బ్యాంకులు తాము అమలు చేస్తోన్న రుణాల మంజూరు వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిఘా మరింత మెరుగుపడినట్టవుతుందని అంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications