Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది, అందుకే సింగపూర్ స్టోరీ చెప్పారు, మాజీ సీఎం !

బెంగళూరు/మంగళూరు/సింగపూర్: కాంగ్రెస్‌ పార్టీలో అన్నీ వ్యవహారాలు సరిగ్గా లేవని మొదటి నుంచీ తేలిపోయిందని, అందుకే ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారని కర్ణాటకలో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. సొంత పార్టీ నాయకుల ప్రకటనతో కర్ణాటక ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని నియంత్రించేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సింగపూర్ వ్యూహాన్ని చెప్పారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

మంగళవారం మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే విబేధాలు మొదలైనాయని, ఆ పార్టీలో వర్గపోరు ప్రారంభం అయ్యిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచే ఆ పార్టీలో సఖ్యతలేదని స్పష్టం అవుతోంది మాజీ సీఎం బవరాజో బోమ్మయ్ అన్నారు.

dkshivakumarbasavarajbommaisiddaramaiah1
కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ముఖ్యమంత్రి ఎంచుకున్న పద్ధతి, సీక్రెట్‌ బ్యాలెట్‌ ఓటింగ్, మెజారిటీ వచ్చినా ఇంత సర్కస్‌ చేశారంటే ఆ పార్టీలో వర్గపోరు ఉందని అర్థం అవుతోందని, ఇచ్చిన ఉచిత హామీల కోసం సిద్ధరామయ్య అభివృద్ధికి గ్రాంట్ ఇవ్వడం లేదని, బదిలీల్లో అవినీతి జరిగినట్లు స్పష్టం అవుతోందని, ఈ విషయాలన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు బీకే. హరిప్రసాద్ ప్రకటన నష్టం నియంత్రణ కోసం సింగపూర్ వ్యూహం గురించి మాట్లాడారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. డీకే శివకుమార్ ఇప్పుడు తన వ్యూహం గురించి మాట్లాడుతున్నారు. వీరిలో సఖ్యతలేదనే విషయాన్ని ఇది డీకే శివకుమార్ మాటలు చెబుతున్నాయని, ఈ ప్రభుత్వం అస్థిరత గురించి ఆలోచించడం లేదని బీజేపీ అంటోంది.

bommai

డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తేడా ఉన్న మాట వాస్తవమే. డీకే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వం గురించి రెండుసార్లు బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారని, ఈ విషయంలో సీఎం సిద్దరామయ్యల మధ్య చాలా విబేధాలు ఉన్నాయని, ఇద్దరి మద్య సఖ్యత లేకపోవడంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జైన ముని హత్య నుంచి కర్ణాటకలో ఇప్పటికే నిత్యం హత్యలు జరుగుతున్నాయని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి న్యాయమూర్తులకు బెదిరింపులు వస్తున్నాయని, న్యాయమూర్తులకే రక్షణ లేకపోతే ఇంకెవరికైనా రక్షణ ఎలా ఉంటుంది?. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చిందని, అంతర్గత కలహాలు పెరిగాయని, ఈ ప్రభుత్వ హామీలను అమలు చేయడానికి ఎస్ సీపీ, టీఎస్ పీ నిధులను ఉపయోగిస్తోంది.

dk-shivakumar-siddaramaiah
దాదాపు 13 వేల కోట్ల నిధులను ఎస్ సీపీ, టీఎస్ పీ పథకం నిధులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత హామీల పథకాలకు బదిలీ చేసింది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తుందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ఉచిత హామీల అమలు సాకుతో కర్ణాటకలో బీజేపీ పథకాలను నిలిపివేశారు. రైతులకు ఇచ్చే రైతు విద్యానిధి, భూ రైతుశక్తి, భూసిరి, జీవన్ జ్యోతి బీమా పథకం నిలిచిపోయింది బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

వ్యవసాయ శాఖలో రూ. 4, 500 కోట్లు, నీటిపారుదల శాఖలో రూ. 3, 500 కోట్లు నిధులు దారిమళ్లాయని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
ఈ ప్రభుత్వం హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అభివృద్ధి పనులు చేయకపోవడంతో మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, దీంతో సొంతపార్టీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య ప్రభుత్వం మీద మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+