తుపాకీతో కాల్చుకుని మాజీ సీఎం మనవడు ఆత్మహత్య
ఛండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఛండీగఢ్లోని తమ నివాసంలో హర్కీరత్ సింగ్ ఆదివారం ఉదయం తనను తాను కాల్చుకున్నాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని సమీపంలోని పీజీమర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ, ప్రాథమిక సమాచారం ప్రకారం అతడు ఏదో అంశం విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిసింది.
కాగా, బియాంత్ సింగ్ స్వగ్రామమైన లూధియానాలోని కోట్లీ గ్రామానికి హర్కీరత్ సింగ్ సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. 2013లో ఆయన గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అతని సోదరుడు గుర్కీరత్ సింగ్.. ఖన్నా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, వీరి తండ్రి తేజేశ్వర్ సింగ్ గతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications