దేశభద్రతపైనా రాజకీయాలేనా: ఎన్డీటీవీ బ్యాన్పై వెంకయ్య ఫైర్
చెన్నై: ఎన్డీటీవీ ప్రసారాల నిలిపివేత అంశంపై వస్తున్న విమర్శలపై కేంద్ర సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు.
దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో కఠినంగా ఉన్నామని, ప్రసార నిబంధనలను ఉల్లంఘించినందుకే ఎన్డీటీవీ ఛానల్పై నిషేధం విధించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు.

ఇలాంటి భద్రత విషయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం అర్థరహితమని అన్నారు. ఛానల్పై నిషేధం విధించడానికి ఎటువంటి కొత్త చట్టాలను తయారు చేయలేదని, కేంద్ర ప్రసార శాఖ నిబంధనల ప్రకారమే నిలిపివేసినట్లు వెంకయ్య పేర్కొన్నారు. 2005 నుంచి 2014 వరకు యూపీఏ పాలనలో మొత్తం 21సార్లు పలు టీవీ ఛానెళ్లపై నిషేధం విధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పఠాన్కోట్ దాడి సందర్భంగా ఆ ఛానెల్ ప్రసారం చేసిన విజువల్స్ వల్ల సైనికులు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండేదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు పనికిరాదని హితవు పలికారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications