శ్రీలంకలో హత్య: ఫేస్బుక్లో పెట్టి కటకటాల వెనక్కి
మైసూరు: వేరే దేశంలో జరిగిన హత్య క్లిప్పింగ్స్ సేకరించి ఐటి, బిటి కంపెనీలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన మాల్ లో హత్య జరిగిందని ఫేస్ బుక్ లో పెట్టి అందరిని ఆందోళనకు గురి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మైసూరు నగరంలో నివాసం ఉంటున్న దినేష్ కులకర్ణి అనే వ్యక్తిని అరెస్టు చేశామని సోమవారం బెంగళూరు లోని అశోక్ నగర పోలీసులు చెప్పారు. బెంగళూరు నడిబోడ్డున ప్రసిద్ది చెందిన గరుడా మాల్ ఉంది. ఈ మాల్ లో అనేక రకాల షాప్ లు, షో రూంలు, మల్టీఫ్లక్స్ థియేటర్లు ఉన్నాయి.
శ్రీలంకలోని ఒక మాల్ లోకి చోరబడిన యువకుడు అక్కడ ఉన్న యువతిని కత్తితో దారుణంగా పోడిచి హత్య చేసి తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్లిప్పింగ్స్ యూ ట్యాబ్ లో చూసిన దినేష్ కులకర్ణి సరి కొత్త ప్లాన్ వేసి ఎదైనా చెయ్యాలని అనుకున్నాడు.
తరువాత ఈ హత్య జరిగింది బెంగళూరులోని గరుడా మాల్ లో అని ఆ క్లిప్పింగ్స్ ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశాడు. వాట్సాప్ లో అనేక మందికి పంపించాడు. విషయం తెలుసుకున్న గరుడా మాల్ యాజమాన్యం అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో దినేష్ కులకర్ణిని అరెస్టు చేశారు.