మావళ్ల కాదు భయ్యా.. బెంగళూరులో బతకలేం..!
బెంగళూరు ప్రజలకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ర్యాపిడో, ఉబర్, ఓలా.. తదితర బైక్ ట్యాక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా ఆ నగరంలో ఆటో ఛార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆఫ్ బెంగళూరు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరలు బెంగళూరు బ్రుహత్ బెంగళూరు నగర పాలిక పరిధిలోకి వర్తిస్తాయని పేర్కొంది.
బెంగళూరు ప్రస్తుతం దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటి. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఐటీ, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులతో ఉరుకులు పరుగులుగా ఉంటుంది ఇక్కడి లైఫ్. అయితే ఈ మధ్య ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్ ట్యాక్సీలు లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ర్యాపిడో, ఉబర్ లు వాడుతుంటారు. అయితే జూన్ 16 నుంచి కర్ణాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు నిలిచిపోయాయి. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాక మరోసారి బెంగళూరు వాసులపై మరో పిడుగు పడింది. తాజాగా ఆ నగరంలో ఆటో ఛార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆఫ్ బెంగళూరు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరలు బెంగళూరు బ్రుహత్ బెంగళూరు నగర పాలిక పరిధిలోకి వర్తిస్తాయని పేర్కొంది.

పెంచిన ధరల ప్రకారం మొదటి 2 కిలోమీటర్లకు ఉన్న రూ. 30 ధరను రూ. 36 కు పెంచారు. అంతేకాక 2 కిలోమీటర్ల తర్వాత ఒక్కో కిలోమీటర్ కు రూ. 18 రూపాయలు చెల్లించాలి. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ ఛార్జీలు అమలవుతాయి. నైట్ ఛార్జీలు డే టైమ్ తో పోల్చితే 1.5 రెట్లు అధికంగా ఉంటాయి. ఇక ఆటో మీటర్లను రీ- వెరిఫై చేసి స్టాంప్ వేస్తారు. అక్టోబరు 31 లోపు కొత్త ధరలను మీటర్ పై డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది.
అంతేకాక వెయింటింగ్ ఛార్జీలను సైతం పెంచింది. మొదటి 10 నిమిషాలు వెయింటింగ్ ఛార్జి లేదు. ఆ తర్వాత ప్రతి 15 నిమిషాలకు రూ. 10 చొప్పున వెయింటింగ్ ఛార్జీ ఉంటుంది. లగేజీ విషయానికి వస్తే 20 కిలోల వరకూ ఎలాంటి ఛార్జీ ఉండదు. ఆ తర్వాత ఒక్కో కేజీ లగేజీ కు రూ. 10 అదనంగా వసూలు చేస్తారు. ఇక లగేజీ 50 కేజీల కంటే అధికంగా ఉండకూడదని రూల్స్ పెట్టింది.
The minimum fare will rise from the current Rs 30 to Rs 36 while the per-kilometre charge will be Rs 18, up from the previous Rs 15
— News18 (@CNNnews18) July 15, 2025
Writes: @harishupadhya | #Auto #Bengaluru https://t.co/Rn11Gsm8KB pic.twitter.com/iQGqHIHMBP
ఆటో ధరల రేట్లు పెంచాలని 2021 నుంచి ఆటో డ్రైవర్ సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఆటో ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications