బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాలు రూ. 1 కోటి, అదే డీకే కొంప ముంచింది, బినామి !
బెంగళూరు: అక్రమ నగదు లావాదేవీలు చేశారని ఆరోపిస్తు అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ గురించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమిని డీకే. శివకుమార్ బినామి పేరుతో కేవలం రూ. 1 కోటికి చెక్ ఇచ్చి విశాలాక్షి దేవి దగ్గర కొనుగోలు చేశారని వెలుగు చూసింది. అదే డీకే. శివకుమార్ కొంప ముంచిందని సమాచారం. బినామీ పేరుతో డీకే ఆ భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

విశాలక్షి దేవి ఎవరు ?
మైసూరు మహారాజుల వంశానికి చెందిన దివంగత శ్రీకంఠదత్త ఒడయార్ సోదరి ఈ విశాలాక్షి దేవి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని ఆస్తిలో విశాలాక్షి దేవికి భాగం ఉంది. విశాలాక్షి దేవికి చెందిన 5 ఎకరాల భూమిని డీకే. శివకుమార్ అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2018లో విశాలాక్షి దేవి మరణించారు.

కోర్టులో ఇవే వాదనలు
కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వరాదని ఈడీ అధికారుల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమిని విశాలాక్షి దేవీ దగ్గర కొనుగోలు చేసిన డీకే. శివకుమార్ కేవలం రూ. 1 కోటికి మాత్రం చెక్ ఇచ్చారని, మిగిలిన నగదు అక్రమంగా బదిలీ చేశారని ఈడీ అధికారుల తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.

బినామి శశికుమార్
డీకే. శివకుమార్ కు శశికుమార్ సమీప బంధువు. డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ అధికారులు దాడి చేసిన సమయంలో శశికుమార్ ఇంటిలో సోదాలు చేశారు. శశికుమార్ ఇంటిలో చిక్కిన డైరీలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమి కొనుగోలు విషయం వెలుగు చూసింది. డీకే. శివకుమార్ బినామి పేరుతో శశికుమార్ పేరు మీద బెంగళూరు ప్యాలెస్ మైదానంలో భూమి కొనుగోలు చేశారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

డబ్బులు ఎక్కడివి ?
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చెయ్యడానికి శశికుమార్ కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అధికారులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చెయ్యడానికి నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం శశికుమార్ చెప్పడం లేదని, ఆ వివరాలు సేకరిస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications