పౌరసత్వ చట్టంపై హిందువులను కించపరిచి, అసభ్యంగా దూషింస్తూ పోస్టర్లు, విద్యార్థులపై కేసులు!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు హిందువులు, భగవంతుడిని అవహేళన చేశారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలో కేసులు నమోదైనాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు కాలేజ్ ఆవరణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అసభ్యంగా దూషిస్తూ పోస్టర్లు ప్రదర్శించారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని హలసూరు పోలీస్ స్టేషన్ లో విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. బెంగళూరు నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో సీఏఏకి విరుద్దంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు హిందువులను కించపరిచి, అసభ్య పదజాలంతో దూషించి పోస్టర్ల ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు
సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పోస్టర్లు ప్రదర్శించడమే కాకుండా హిందువులను కించపరిచే విధంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై హలసూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయ్యింది. తరువాత విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లే సమయంలో అనుమతి లేకుండానే కాలేజ్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించారని, కాలేజ్ ఆవరణంలో అనుమతి లేకుండా గుంపులు గుంపులుగా ధర్నాలు నిర్వహించారని కాలేజ్ ప్రిన్సిపల్ నీలమతి విద్యార్థుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలేజ్ విద్యార్థుల గ్యాంగ్ లు
క్రైస్ట్ కాలేజ్, సెంట్రల్ కాలేజ్ తో పాటు బెంగళూరు నగరంలోని వివిద కాలేజ్ ల విద్యార్థులు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో (గ్యాస్ టీం) గుమికూడి హిందూ ధార్మిక భావాలను దెబ్బతీసే విధంగా నినాదలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా విద్యార్థులు పట్టించుకోలేదని, ధర్నాలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసులు నమోదైనాయి.

ఐపీఎస్ సెక్షన్ లు
కాలేజ్ విద్యార్థి సంఘం నాయకులు సరోవర్, గౌతమ్ రాజ్, అమృతా, మల్లికార్జున్, అమూల్య, ఆండ్రియా, రాజ్ గోపాల్ తో పాటు అనేక మంది విద్యార్థులపై ఐపీఎస్ 188, 153 ఏ, 295 ఏ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టామని డీసీపీ చేతన్ సింగ్ శనివారం మీడియాకు చెప్పారు.

కాలేజ్ యాజమాన్యం
ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను గుర్తించడానికి కాలేజ్ యాజమాన్యం, పరిపాలనా విభాగం అధికారుల సహాయం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల వివరాలు, సమాచారం ఇవ్వకుండా వారిని రక్షించడానికి కాలేజ్ యాజమాన్యం, పరిపాలనా విభాగం అధికారులు ప్రయత్నిస్తే వారిమీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ కేసులకు సంబంధించి ఇంత వరకు విద్యార్థులు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని, విచారణ చేస్తున్నామని డీసీపీ చేతన్ సింగ్ శనివారం మీడియాకు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications