IT Hub: ఐటీ కంపెనీలు జంప్ జిలాని ?, చర్చలకు సీఎం, వాన దెబ్బకు ఐటీకి వందల కోట్లు నష్టం !
బెంగళూరు: బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక ప్రభుత్వానికి టెన్షన్ మొదలైయ్యింది. వివిద కారణాలు, వాతరణం చల్లగా ఉంటుందని, మూడు రాష్ట్రలకు దగ్గరగా ఉంటుందని బెంగళూరు నగరం ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి బెంగళూరు నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక విపరీతంగా వానలు పడటంతో ప్రజలు పడుతున్న పాట్లు టీవీ సీరియర్ లాగా సాగుతుంది. ఆదివారం నుంచి బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బతో ఐటీ కంపెనీలకు వందల కోట్ల నష్టం వచ్చిందని వెలుగు చూసింది. ఐటీ కంపెనీలకు వచ్చిన వందల కోట్ల రూపాయల నష్టం గురించి చర్చించి న్యాయం చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ బహిరంగంగా చెప్పారు. సీఎం స్వయంగా స్పందించారంటే బెంగళూరులో ఏరీతిలో వర్షాలు పడుతున్నాయో అనే విషయం అర్థం అవుతోంది. మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామని కొన్ని ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి అల్టిమేటం విదించాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
వీరకొట్టుడు.... దంచుకొట్టుడు
బెంగళూరు నగరంలో వనదేవుడు ప్రతాపం చూపించాడు. వానదేవుడి దెబ్బతో బెంగళూరు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినాయక చవితి పండుగ కోసం నాలుగైదు రోజులు సెలవులు పెట్టుకుని సొంతఊర్లకు వెళ్లిన ప్రజలు సోమవారం వేకువ జామున నుంచి బెంగళూరు సిటీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే దెబ్బకు బెంగళూరులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రజలకు మైండ్ బ్లాక్ అయ్యింది.
వాతావరణం చల్లగా ఉంటుందని ?
బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక ప్రభుత్వానికి టెన్షన్ మొదలైయ్యింది. వివిద కారణాలు, వాతరణం చల్లగా ఉంటుందని, మూడు రాష్ట్రలకు దగ్గరగా ఉంటుందని బెంగళూరు నగరం ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐటీ హబ్ అంటే ప్రజలు బెంగళూరు పేరు టక్కున చెప్పడం అందరికి తెలిసిందే.
గంటలు గంటలు ట్రాఫిక్ జామ్
బెంగళూరు నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక విపరీతంగా వానలు పడటంతో ప్రజలు పడుతున్న పాట్లు టీవీ సీరియర్ లాగా సాగుతుంది. బెంగళూరు నగరంలో సోమవారం ఉదయం నుంచి గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఐటీ కంపెనీలకు రూ. 225 కోట్లు నష్టం
ఆదివారం నుంచి బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బతో ఐటీ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వచ్చిందని వెలుగు చూసింది. ఐటీ కంపెనీలకు వచ్చిన రూ. 225 కోట్ల రూపాయల నష్టం గురించి చర్చించి న్యాయం చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు.
ఐటీ కంపెనీలు జంప్ జిలాని ?
కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్వయంగా స్పందించారంటే బెంగళూరులో ఏరీతిలో వర్షాలు పడుతున్నాయో అనే విషయం అర్థం అవుతోంది. మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామని కొన్ని ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి అల్టిమేటం విదించాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు వాస్తవం కాదని, ఐటీ కంపెనీలకు ఇలాంటి సమస్యల నుంచి శాస్వత పరిష్కారం చూపించడానికి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది.