ఇంటిముందే ఐబిఎం ఉద్యోగిని పొడిచి చంపారు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంప్యూటర్ హార్డ్వేర్ దిగ్గజం కాల్ సెంటర్ ఉద్యోగిని దుండగులు 9సార్లు కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అతని ఇంటి ముందే జరగడం గమనార్హం.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ దారుణ ఘటన పంథరపాల్యాలో గురువారం ఉదయం 4గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడిని అభిషేక్ తిమ్మరాయప్ప(30)గా గుర్తించారు.
కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటి వద్దకు చేరుకున్న అభిషేక్ను కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. 9సార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడే కుప్పకూలిపోయాడు.

అభిషేక్ అరుపులు విన్న అతని అంకుల్.. వెంటనే బయటికి వచ్చి అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అభిషేక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, నయందనహళ్లిలోని న్యూ నేషనల్ స్కూల్కు యాజమనిగా కూడా అభిషేక్ ఉన్నారు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, రెండేళ్ల కూతురు ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications