Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ బంద్ నేడే: వీటిపైనే ప్రభావం, రైతు నేతలతో కేంద్రం మూడో విడత చర్చలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఢిల్లీ చలో' ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం భారత్ బంద్​‌కు పిలుపునిచ్చింది. భారతీయ కిసాన్ పరిషత్ కూడా ఈ బంద్‌​కు మద్దతు తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో దేశ వ్యాప్తంగా సమ్మె ప్రారంభం కానుంది. అదేరోజు పంజాబ్‌లో రాష్ట్ర, జాతీయ రహదారులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు.

మరోవైపు, రైతు నాయకుడు గురునామ్‌ సింగ్‌ తమ తర్వాతి మూడు రోజుల కార్యాచరణను వెల్లడించారు. శుక్రవారం రోజు మూడు గంటల పాటు టోల్‌ ఫ్రీ కార్యక్రమం నిర్వహిచడం, శనివారం ట్రాక్టర్ల ర్యాలీ, 18 తేదీన రైతు, కార్మిక సంఘల సంయుక్త సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. బంద్​‌కు పిలుపు నేపథ్యంలో నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ప్రజలు ఒకేచోట గుమిగూడవద్దని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోయిడాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీలైనంత వరకు ప్రజలు మెట్రో ఉపయోగించుకోవాలని సూచించారు.

Bharat Bandh Today, as farmer, trade unions announce nationwide strike

దేశ వ్యాప్తంగా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు శుక్రవారం మూసివేసే అవకాశం ఉంది. వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పనులు, గ్రామీణ పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు కూడా మూసివేయబడతాయి. అయితే, పాఠశాలలు, విద్యా సంస్థలు, ఫార్మసీలు, ఎమర్జెన్సీ సేవలు శుక్రవారం యాథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి.

ఇది ఇలావుండగా, కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)కు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. చండీగఢ్​లో ఈ మేరకు మూడో విడత చర్చలు ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ రైతుల తరఫున కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+