భారత్ సర్జికల్ స్ట్రైక్ 2.o ఒక్కరు కూడా చనిపోలేదన్నపాక్ ఆర్మీ చీఫ్ షాకింగ్ ట్వీట్
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దేశం మొత్తం ఆగ్రహావేశాలతో రగిలిపోయిన ఉగ్రదాడి ఘటనకు సమాధానం చెప్పింది. ఉగ్రవాదాన్ని అణచివేయటం కోసం భారత్ నడుం బిగించింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఈ దాడిలో పెద్ద ఎత్తున జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు.దాదాపు 300 మంది చనిపోయివుంటారని అంచనా . అయితే అధికారికంగా ఎంతమంది చనిపోయారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ క్యాంప్పై దాడి కారణంగా సామాన్యులకు ఎలాంటి నష్టం కలగలేదని విజయ్ గోఖలే స్పష్టం చేశారు.
అయితే భారత్ జరిపిన సర్జికల్ ఎటాక్ పై పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. దాదాపు 300 మంది మరణించారని భావిస్తుంటే ఒక్కరు కూడా మరణించలేదని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
భారత యుద్ధ విమానాలు పీఓకే ప్రాంతంలో దాడులు జరిపి..భారీ ప్రాణనష్టానికి కారణమైనట్టు వచ్చిన వార్తలను మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రంగా ఖండించారు.

"ముజఫరాబాద్ సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయనీ.. అవి కొన్ని బాంబులను జారవిడిచాయి. అయితే అవి ఖాళీగా ఉన్న ప్రాంతంలో పడ్డాయి తప్ప..మాకు ఎటువంటి నష్టాన్నికలిగించలేదనీ..ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం" అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ అవాస్తవమని, ఎటాక్ లో భారీగానే ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది.భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటిస్తే అలాంటిదేమీ లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చెప్పడం గమనార్హం.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications