ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ అగ్ని ప్రమాదం: పక్కనే 5.5 కోట్ల అత్యాధునిక ఫైరింజిన్ ఉంది కానీ..
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చోచేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరంతస్తుల భవనంలో కీలక ప్రభుత్వ శాఖల కార్యాలయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అగ్ని మాపక సిబ్బంది, వాయుసేన, సైన్యం సాయంతో 14 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే, భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్న సమయంలో అక్కడికి కేవలం 40 మీటర్ల దూరంలోనే ఓ ఆధునిక ఫైర్ ఇంజిన్ నిలిపి ఉంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ ఫైర్ ఇంజిన్ను సకాలంలో ఉపయోగించివుంటే మంటలు మరింత త్వరగా అదుపులోకి వచ్చేవని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు చెబుతున్నారు. కాగా, తొమ్మిది నెలల క్రితం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5.5 కోట్లతో అత్యాధునిక హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ను కొనుగోలు చేసింది. దీని సాయంతో అగ్నిమాపక సిబ్బంది 18 అంతస్తుల వరకు సునాయాసంగా చేరుకోవచ్చు.

కానీ, స్థానిక ఆర్టీఏ అధికారుల నుంచి ఈ ఫైర్ ఇంజిన్కు అనుమతులు రాకపోవడంతో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మరోవైపు, ఈ హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ వినియోగంపై సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడంతో దీన్ని పక్కన పెట్టడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వివరణ ఇచ్చారు.
#WATCH | Firefighters engaged in the operation to douse the massive fire that broke out at the Satpura Bhawan building in Bhopal, Madhya Pradesh pic.twitter.com/oZjta09t8B
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2023
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో దాన్ని ఉపయోగించలేదని మంత్రి తెలిపారు. ఇకపై పెద్ద భవనాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు సరిపడా దారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లు మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
#WATCH | Army personnel help local administration and Fire services in the operation to douse a massive fire at the Satpura Bhawan building in Bhopal, Madhya Pradesh pic.twitter.com/JlR0cSB433
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2023
కాగా, సత్పురా భవన్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. పెద్ద ఎత్తున భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, వాయుసేన. పెద్ద ఎత్తున ఫర్నీచర్, కీలక ఫైల్స్ ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం గమనించి ముందే భవనం నుంచి సిబ్బంది, అధికారులు బయటకు వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications