gn saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి-బోంబే హైకోర్టు సంచలన తీర్పు..!
మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో గతంలో అరెస్టై దోషిగా కూడా నిర్ధారణ అయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల నేత జీఎన్ సాయిబాబా కేసులో బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో గడ్చిరోలి కోర్టు సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాల కేసులో దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా అనారోగ్యంతోనే జైల్లో గడుపుతున్నారు.
2017లో మావోయిస్టు సాహిత్యం దొరకడంతో ప్రొఫెసర్ సాయిబాబాకు వారితో సంబంధాలున్నాయంటూ ఉపా కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తర్వాత మహారాష్టలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు విచారణ జరిపి ఆయన్ను దోషిగా నిర్దారించి జైలుకు పంపింది.

అయితే 2022లో బోంబే హైకోర్టు అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బోంబే హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. మరోసారి ఈ కేసుపై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.
దీంతో మరోసారి విచారణ జరిపిన బోంబే హైకోర్టు.. గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ధాటించింది. మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా నిర్దారిస్తూ ఇవాళ మరోసారి తీర్పు చెప్పింది. బోంబే హైకోర్టు తీర్పుతో సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా బోంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో వారు కూడా విడుదల కాబోతున్నారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications