పంజాబ్లో కాంగ్రెస్కు గట్టి షాక్.. జస్బీర్ సింగ్ రాజీనామా.. సోనియాకు భావోద్వేగ లేఖ..
పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలింది. పార్టీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం వారిని బుజ్జగించినా వెనక్కితగ్గడంలేదు. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆపార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జస్బీర్ సింగ్ ఖంగుర కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
Recommended Video

సోనియాగాంధీకి రాజీనామా లేఖ
తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను లేఖలో సోనియా గాంధీకి జస్బీర్ సింగ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి జగ్పాల్ సింగ్ ఖంగురా 60 ఏళ్లుగా, తాను 20 ఏళ్లుగా నుంచి సేవలు చేశామని గుర్తుచేశారు. పార్టీ తరుపున ఇంత కాలం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గతంలోలాగా లేవని విమర్శించారు. సేవ చేసేవారికి గుర్తింపు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అసెంబ్లీ టికెట్ నిరాకరణ
కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న జస్బీర్ సింగ్ ఎన్నికల వేళ రాజీనామా చేయడం ఆపార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఖిలా రాయ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మరోకరికి అవకాశం ఇచ్చింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్నఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు.

కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు
పంజాబ్లో అధికారం దగ్గించుకునేందుకు ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒకవైపు, టికెట్ దక్కనివారి అసమ్మతి సెగలతో మరోవైపు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ నేతల మధ్య బేదాభిప్రాయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని రెండు రోజుల కిందటే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హితబోధ చేశారు. మరో సారి అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

పంజాబ్లో కేజ్రివాల్ దూకుడు
అటు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పంజాబ్లో మూడు రోజుల నుంచి విసృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ ప్రజలు నిజాయితీ గల వ్యక్తిని సీఎంగా ఎంచుకోవాలని కోరారు. ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications