అసలు అగ్నిపరీక్ష: పదవులపై పేచీ: ఎల్లుండి ఎన్డీఏ భేటీ: ముఖ్యమంత్రికి అసమ్మతి ఉచ్చు
పాట్నా: బిహార్ రాజకీయాల్లో మలి అంకం ఆరంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన నితీష్ కుమార్ ప్రభుత్వానికి అసలు అగ్నిపరీక్ష ఎదురైంది. ఇన్నాళ్లూ ఓ మోస్తరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ఆయన రాజకీయ చతురతకు, వ్యూహాలకు ఈ సారి అయిదేళ్ల పదవీ కాలం ముళ్ల కిరీటంలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పదవుల పంపకాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా.. ప్రభుత్వం మైనారిటీలో పడే ప్రమాదాన్ని నితీష్ కుమార్ ఎదుర్కొంటున్నారు.
స్థానిక సంస్థల పోరుపైనా కన్నేసిన ఒవైసీ: అసద్తో బిహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ: రోడ్ మ్యాప్
ఆ రెండు పార్టీలే కీలకం..
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు అవసరం అవుతాయి. దీనికంటే మూడంటే మూడు సీట్లను మాత్రమే జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతాపార్టీ సంకీర్ణ కూటమి దక్కించుకోగలిగింది. మొన్నటి ఎన్నికల్లో జేడీయూ-115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ఇందులో బీజేపీ-74, జేడీయూ-43 సీట్లల్లో గెలుపొందాయి. ఈ రెండు పార్టీలకు కూడా 122 స్థానాలు దక్కలేదు. ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకున్న హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగు చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి.
మంత్రి పదవులు..
ఈ
రెండు
పార్టీలకు
చెందిన
ఎనిమిది
మంది
ఎమ్మెల్యేలను
కలుపుకొంటే
125కు
చేరుతుంది
నితీష్
కుమార్
బలం.
ఈ
ఎనిమిది
మంది
ఎన్డీఏ
నుంచి
బయటికి
వస్తే..
నితీష్
కుమార్
ప్రభుత్వం
మైనారిటీలో
పడిపోతుంది.
ఏ
రకంగా
చూసుకున్నా
ఇది
ఆయనకు
కత్తి
మీద
సాములాంటిదే.
ఈ
పరిణామాల
మధ్య
జేడీయూ,
బీజేపీ,
హిందుస్తానీ
ఆవామ్
మోర్చా,
వికాల్
శీల్
ఇన్సాఫ్
పార్టీ
నేతలు,
ఎమ్మెల్యేలు
ఆదివారం
రాజధాని
పాట్నాలో
సమావేశం
కాబోతున్నారు.
మంత్రి
పదవుల
కేటాయింపుపై
ఈ
భేటీలో
స్పష్టత
వచ్చే
అవకాశం
ఉంది.
ముఖ్యమంత్రిగా నితీష్ ఎన్నిక..
ముఖ్యమంత్రి
అభ్యర్థిని
నిర్ణయించడానికి
అవసరమైన
ఉమ్మడి
సమావేశాన్ని
ఎప్పుడు
నిర్వహించాలనే
అంశంపై
చర్చించడానికి
ఎన్డీఏ
నేతలు
ఈ
ఉదయం
పాట్నాలో
నితీష్
కుమార్
నివాసంలో
భేటీ
అయ్యారు.
అనంతరం
ఆదివారం
భేటీ
కావాలని
నిర్ణయించారు.
ముఖ్యమంత్రిగా
నితీష్
కుమార్ను
ఈ
సమావేశం
సందర్భంగా
అధికారికంగా
ఎన్నుకోవడం
లాంఛనప్రాయమే.
సభాపక్ష
నేతగా
ఆయనను
ఎన్నకుంటారు.
ప్రమాణ
స్వీకారం
ఎప్పడు
చేయాల్సి
ఉంటుందనే
తేదీని
కూడా
ఈ
సమావేశంలోనే
ఖరారు
చేస్తారు.
మంత్రివర్గంలో
ఎవరెవరిని
తీసుకోవాలనే
అంశంపైనా
చర్చ
సాగడం
ఖాయంగా
కనిపిస్తోంది.
ఈ
భేటీని
ఎన్డీఏ
నేతలు
అత్యంత
కీలకమైనదిగా
భావిస్తున్నారు.
Recommended Video
సాయంత్రం కేబినెట్..
ఇదిలావుండగా.. ఈ సాయంత్రం నితీష్ కుమార్.. మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మంత్రులకు మాత్రమే ఈ కేబినెట్కు హాజరు కావాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు సమాచారాన్ని పంపించినట్లు చెబుతున్నారు. గెలిచిన మంత్రులు ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంటుంది. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా వారు తమ తదుపరి చర్యలను తీసుకుంటారని అంటున్నారు.