షాకింగ్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బలి -కరోనా సోకి అవయవాలు దెబ్బతిని బీహార్ సీఎస్ అరుణ్ సింగ్ మృతి
కరోనా మహమ్మారి రెండోదశ విలయం అతి భయంకరంగా కొనసాగుతున్నది. తొలి వేవ్ లో సేఫ్ గా బయటపడ్డ రాష్ట్రాలన్నీ సెకండ్ వేవ్ ధాటికి కుదలవుతున్నాయి. తూర్పు రాష్ట్రం బీహార్ లో ఉధృతంగా వ్యాపించిన వైరస్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా పొట్టనపెట్టుకుంది...
బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి, పాట్నాలోని ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్ సోకిన తర్వాత అరుణ్ సింగ్ శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి విషమించడం వల్లే ప్రాణాలు పోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో బీహార్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మార్చి తర్వాత నుంచి బీహార్ లోనూ కొత్త కేసులు, మరణాలు పెరుగుతుండటంతో వైరస్ కట్టడి దిశగా ఆయన పని చేశారు. అంతలోనే విషాదకరంగా ఆయనే వైరస్ కాటుకు బలయ్యారు. సీఎస్ మృతిపై సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తదుపరి సీఎస్ ను ఇంకొద్ది గంటల్లో ఖరారు చేయనున్నారు.
సెకండ్ వేవ్ లో రోజువారీ కేసులు భారీగా పెరగడంతో బీహార్ యాక్టివ్ కేసులు ఇప్పుడు 1లక్షకుపైగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 4.54లక్షలు, మొత్తం మరణాలు 2,480గా ఉన్నాయి. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సైతం స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications