బీహార్ సీఎం నితీశ్ కుమార్పై యువకుడు దాడి..! బిత్తరపోయిన భదత్రా సిబ్బంది..!! అసలేం జరిగిందంటే..?
బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్కు తన సొంత ఊరిలో పరాభవం ఎదురైంది. పాట్నా సమీపంలో ఉన్న భక్తియార్పూర్ నితీశ్పై ఓ యువకుడు దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురైయ్యారు. ఏం జరుగుతోందని అనుకునేలోపే యువకుడు నితీశ్పై చెంపపై కొట్టాడు. దీంతో భద్రతా సిబ్బంది బిత్తరపోయారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
నితీశ్ కుమార్పై యువకుడు దాడి
ఈ ఘటన భక్తియార్పూర్ మార్కెట్కు సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక ఆస్పత్రి కాంప్లెక్స్లో రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరమోధుడు శిల్ఫాద్ర యాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా ఓ యువకుడు దాడిగి దిగాడు. ఇది సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సీఎం సొంత గ్రామంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

యువకుడు అరెస్ట్
శిల్వాద్ర యాజీ విగ్రహాం వద్ద ఉన్న సీఎం నితీశ్ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు దూకుడుగా ముందుకు వెళ్లాడు.. అక్కడ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా వారిని తోసుకుని వెళ్లి నితీశ్ కుమార్ పై దాడికి పాల్పడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుడిని విచారిస్తున్నారు.

గతంలోనూ నితీశ్పై దాడులు
యూపీ సీఎం యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత నితీశ్ తిరిగి పాట్నాకు వచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్వగ్రామం భక్తియార్పూర్కు వచ్చారు. ఈ సందర్భంగా శిల్పాద్ర యూజీ విగ్రహానికి పూలమాల వేయబోతుండగా యువకుడు దాడి చేశారు. గతంలో కూడా నితీశ్ కుమార్పై దాడి జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా ముధుబనిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనపై ఉల్లిపాయలు, ఇటుకలతో కొందరు దాడి చేశారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచారు.












Click it and Unblock the Notifications