తాగితే చస్తారుగా.. బీహార్ మద్యం మరణాలపై నితీశ్ కామెంట్స్-పరిహారానికీ నిరాకరణ
బీహార్ లోని సరాన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 30 మందికి పైగా చనిపోయారు. దీనిపై నితీశ్ కుమార్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో కల్తీ మద్యం తాగి ఇంతమంది చనిపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ కుమార్.. తాజాగా ఈ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ మద్యం మృతుల కుటుంబాకు పరిహారాన్ని సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. దీంతో పరిహారం కోసం ఎదురుచూస్తున్న మద్యం మృతుల కుటుంబాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన నితీశ్ కుమార్ తన వ్యాఖ్యలతో అగ్గికి ఆజ్యం పోశారు. బీహార్లో 2016 నుంచే మద్య నిషేధం అమలవుతోందని, తాగితే చస్తారని ప్రజలు తెలుసుకోవాలని నితీశ్ సూచించారు. అలాగే ఇకపై మద్యం తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా మరో ఉచిత సలహా ఇచ్చారు.

మద్యం మరణాల తర్వాత ఎదురవుతున్న నిరసనలపై నితీష్ కుమార్ విధానసభలో ఓ దశలో సహనం కోల్పోయారు. బిజెపి సభ్యుల్ని ఉద్దేశించి మీరు తాగి మాట్లాడుతున్నరంటూ విమర్శలు చేశారు. ఇవాళ మద్యం మృతుల కుటుంబాలకు పరిహారం నిరాకరించడంతో పాటు వారిపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాము ఇప్పటికే మద్య సేవనంపై అవగాహన డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు నితీశ్ తెలిపారు. నిషేధం లేనప్పుడు కూడా విషపూరితమైన మద్యంతో ప్రజలు చనిపోతున్నారని నితీస్ గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్ధితి ఉందన్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications