బీహార్ను డిసైడ్ చేసే దళిత ఓటు బ్యాంకు: సర్వేలో సంచలన విషయాలు..!!
Bihar Assembly Election 2025:త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం బీహార్లో పర్యటించి ఎన్నికల వేడిని మరింత పెంచారు. ఇక అక్కడి స్థానిక జాతీయ పార్టీలు కూడా మాటల యుద్ధానికి దిగాయి.ఇక సందులో సడేమియా అన్నట్లుగా సర్వేలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైన తాజా సర్వే నివేదిక సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని దళిత ఓటర్లలో 27.4% మందికి భారత ఎన్నికల సంఘం (ECI)పై "నమ్మకం లేదని" ఈ సర్వే వెల్లడించింది. అంతేకాదు, షెడ్యూల్డ్ కులాల (SC) ఓటర్లలో 58% మందికి పైగా రాబోయే ఎన్నికల్లో "నిరుద్యోగమే" తమకు అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారని స్పష్టం చేసింది.
సర్వే నేపథ్యం, వివరాలు:
దేశవ్యాప్తంగా వందలాది దళిత, ఆదివాసీ సంఘాల సమాఖ్య అయిన నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత అండ్ ఆదివాసీ అసోసియేషన్స్ (NACDAOR) ఈ సమగ్ర సర్వేను నిర్వహించి విడుదల చేసింది. NACDAOR చైర్మన్ అశోక్ భారతి ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక 'ది హిందూ'కు ఇచ్చిన వివరాల ప్రకారం, జూన్ 10 నుండి జూలై 4 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 18,581 మంది SC ఓటర్లను నేరుగా సంప్రదించి ఈ సర్వేను చేపట్టారు. కాగా, 2022 బీహార్ కుల సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభాలో 19.65% మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే.

ఓటు హక్కుపై భయం,ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు:
సర్వే జరుగుతున్న సమయంలోనే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రారంభించడంతో, మధ్యలో ఒక కొత్త ప్రశ్నను జోడించాల్సి వచ్చిందని భారతి వివరించారు. ఈ ప్రశ్నకు సుమారు 8,500 మంది మాత్రమే స్పందించగలిగారు. "కొత్త ఓటర్ల జాబితాలో మీ ఓటును కోల్పోతారని మీరు భయపడుతున్నారా?" అనే ప్రశ్నకు, 71% మంది 'అవును' అని బదులివ్వడం గమనార్హం. కేవలం 23.4% మంది మాత్రమే 'లేదు' అని చెప్పగా, 5% మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు.
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనే సాధారణ ప్రశ్నకు, 27% మందికి పైగా 'లేదు' అని, సుమారు 51% మంది 'అవును' అని, మిగిలిన 21% మంది 'తెలియదు' అని సమాధానం ఇచ్చారు. ఈ ఫలితాలు ఎన్నికల ప్రక్రియపై దళిత సమాజంలో నెలకొన్న విశ్వాస లోపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
రాజకీయ నాయకుల ప్రాధాన్యతలు,కులగణన ఘనత:
ఈ సర్వేలో "తమకు ఇష్టమైన జాతీయ,రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు ఎవరు?","ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?", "ఇప్పుడు జరగనున్న కుల గణన ఘనత ఎవరికి దక్కుతుంది?" వంటి 11 కీలక ప్రశ్నలు అడిగారు.
జాతీయ స్థాయిలో, 47.5% మంది ప్రధాని నరేంద్ర మోడీ తమకు ఇష్టమైన నాయకుడని పేర్కొనగా, 40.3% మంది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, సుమారు 12% మంది ఇతర రాజకీయ నాయకులను ఎంచుకున్నారు. కుల గణన ఘనత విషయానికి వస్తే, 33.15% మంది నరేంద్ర మోడీకి, 30.81% మంది రాహుల్ గాంధీకి, 27.57% మంది బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్కు ఆ ఘనత దక్కుతుందని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పనితీరును సుమారు 48% మంది "బాగాలేదు" అని చెప్పగా, 45% మంది "మంచి" అని పేర్కొన్నారు.
"దళితులచే,దళితుల కోసం" నిర్వహించిన సర్వే:
"చాలామంది షెడ్యూల్డ్ కులాలపై సర్వేలు చేస్తారు, కానీ చాలా తక్కువమంది మాత్రమే నిజంగా మాతో నేరుగా మాట్లాడతారు. ఈ సర్వే దళితుల కోసం, దళితులచే చేయబడింది," అని అశోక్ భారతి గట్టిగా నొక్కి చెప్పారు.బీహార్లోని కోసి, మిథిలాంచల్, సీమాంచల్, భోజ్పూర్, చంపారన్, మగధ్ పటాలిపుత్ర అనే ఆరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుమారు 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో SC ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు తమ ఎన్యూమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు. NACDAOR ఈ సర్వేను రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ 'ది కన్వర్జెంట్ మీడియా' సహకారంతో నిర్వహించింది. ఇది వారు విడుదల చేసిన రెండవ సర్వే. ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వారు ఇదే తరహా సర్వేను నిర్వహించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications