వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోరం: దేవత ప్రసన్నం కోసం యువకుడి ఆత్మ బలిదానం
దేవత ప్రసన్నమవుతుదనే నమ్మకంతో ఓ యువకుడు తన ప్రాణాలు అర్పించాడు. అమ్మ వారి విగ్రహం ఎదుట ఉన్న బలిపీఠంపై గొంతు కోసుకుని ఆత్మబలిదానం చేశాడు.
రామ్ గఢ్: దేవత ప్రసన్నమవుతుదనే నమ్మకంతో ఓ యువకుడు తన ప్రాణాలు అర్పించాడు. అమ్మ వారి విగ్రహం ఎదుట ఉన్న బలిపీఠంపై గొంతు కోసుకుని ఆత్మబలిదానం చేశాడు.
జార్ఘండ్ లోని రామ్ గఢ్ లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీహార్ కు చెందిన సంజయ్ నట్ మంగళవారం ఉదయం జార్ఘండ్ రాష్ట్రం రామ్ గఢ్ జిల్లాలోని ప్రముఖ చిన్నామస్టా ఆలయానికి వచ్చాడు.
కాళీమాతను పోలిన ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే అతడు పూజల తర్వాత గుడిలోని బలిపీఠంపై గొంతు కోసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ బలిపీఠంపై సాధారణంగా జంతువులను బలి ఇస్తారు.
ఈ సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అతడి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్నామస్టా ఆలయ నిర్వాహకులు కొంతసేపు గుడిని మూసి శుద్ధి చేశారు.
Comments
English summary
A 30-year-old man killed himself by slitting his throat in Jharkhand’s Ramgarh district on Tuesday in a ritual to appease a goddess depicted in Hindu scriptures as having severed her own head with a scimitar.
Story first published: Tuesday, January 31, 2017, 19:35 [IST]