బాలికలపై ఆకృత్యాలు: బీహార్ మంత్రి మంజూ రాజీనామా
పాట్నా: దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన ముజఫర్పూర్ షెల్టర్ హోం చిన్నారులపై జరిగిన ఆకృత్యాల ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు.
ఈ కేసులో ఆమె, ఆమె భర్త పాత్రపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న మంజూ వర్మ తెలిపారు.

ముజఫర్పూర్ షెల్టర్ హోం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్తో మంజూ వర్మ భర్తకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు వెలుగులోకి వచ్చాయి.
హోంలో ఆశ్రయం పొందుతున్న 40మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్లు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, షెల్టర్ హోంను బీహార్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి షెల్టర్ హోంను అధికారులు సీజ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications