వాళ్లే నమ్మలేకపోయారు.. బిలాస్పూర్లో ఉష్ణోగ్రతలు ఎంతకు పెరిగాయంటే?
రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు.
రాయ్పూర్: చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో అత్యధికంగా 49.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం నాడు నమోదైన ఈ ఉష్ణోగ్రతను చూసి అధికారులే షాక్ తిన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఉష్ణోగ్రత తప్పుగా నమోదైందా? లేక నిజంగానే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయా? అన్న సందేహం కలిగింది.
రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు. అదే సోమవారం నాడు రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయ్ పూర్ నుంచి బిలాస్పూర్ 120కి.మీ దూరంలో ఉంటుంది.

బిలాస్పూర్లో ఇంతకుముందు మే23,2013లో అత్యధికంగా 47.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుని 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. తొలుత సాంకేతిక లోపాలేమైనా తలెత్తయా? అన్న అనుమానం కలిగినప్పటికీ.. నైరుతి నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications