కేరళలో మళ్ళీ బర్డ్ ఫ్లూ భయం: అలప్పుజా జిల్లాలో నిర్ధారణ; అక్కడ పక్షులను చంపాలని ఆదేశం
కేరళ రాష్ట్రానికి మళ్ళీ బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను కేరళలో గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. కేరళలోని అల్లపుజాలోని కుట్టనాడ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ యొక్క తాజా కేసులను అధికారులు ధృవీకరించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ... అలప్పుజా జిల్లాలో నిర్ధారణ
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్లు మరియు బాతులను చంపడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.అలప్పుజా జిల్లాలోని తకజీ పంచాయతీ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక రైతు పెంచిన వేలాది బాతులు చనిపోయాయని భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్కు నమూనాలను పంపిన తర్వాత తాజా కేసులు నిర్ధారించబడ్డాయి.దీంతో సరిహద్దు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.దీనిని అనుసరించి, ప్రభావిత ప్రాంతాల్లో బాతులు మరియు కోళ్లను చంపడానికి పశుసంవర్ధక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది.

కేసులు గుర్తించిన ప్రాంతంలో బాతులు, కోళ్ళు, ఇతర పక్షులను చంపాలని ఆదేశాలు
కేసులు గుర్తించిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.బాతులు, కోళ్లు, గుడ్లు, పేడ మరియు ఇతర కోళ్ల కదలికలపై 12 కి.మీ పరిధిలో చుట్టూ ఇన్ఫెక్షన్ మరింతగా వ్యాప్తి చెందకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కేరళలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇది రెండోసారి. గతంలోనూ కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఈ రెండు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సంభవించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు రాష్ట్రంలో అప్రమత్తం అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

గతంలోనూ అలప్పుజ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ.. ఇప్పుడు మళ్ళీ అక్కడే
గతంలో అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్ ప్రాంతంలోని నేదుముడి, తకాళి, పల్లిప్పడ్ మరియు కరువత్తా అనే నాలుగు పంచాయతీల నుండి , అలాగే కొట్టాయం జిల్లాలోని నీందూర్ పంచాయతీలో బర్డ్ ఫ్లూ నివేదించబడింది. అప్పుడు వైరస్ సంక్రమణ కారణంగా ఒక రైతు పొలంలో సుమారు 1,700 బాతులు చనిపోయాయి. కోళ్లు, టర్కీలు, బాతులు వంటి దేశీయ పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షి మలం లేదా దాని ముక్కు, నోరు లేదా కంటి నుండి స్రావాల ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఏడాది కేరళలో బర్డ్ ఫ్లూ భయాందోళన ఇది రెండో సారి గతంలో బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతంలోనే ఇప్పుడు కూడా కేసులు నమోదు కావటం గమనార్హం .

అలెర్ట్ అయిన కేరళ ప్రభుత్వం.. అధికారులకు ఆదేశాలు
వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.బాధిత ప్రాంతాలలో 10 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి సందర్శించే వలస పక్షులను రాష్ట్ర అటవీ శాఖ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది.వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బర్డ్ ఫ్లూ పై అలెర్ట్ గా ఉండాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి జంతువుల నుండి మనుషులకు సోకిన దాఖలాలు లేవు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications