ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ నందిని పాలతో దెబ్బ కొట్టిన బీజేపీ, మహిళలకు ఫిక్సెడ్ డిపాజిట్లు ! s
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీలు ఒక పార్టీ మీద ఒకరు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో అముల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా నందిని బ్రాండ్ ను నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే అదే నందిని ఫ్రీ పాలు స్కీమ్ తో కాంగ్రెస్ కు బీజేపీ దెబ్బ కొట్టింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కన్నడిగులకు వరాల జల్లు కురుపిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పేదలకు ఆరు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, ఆటో డ్రైవర్లు, మహిళలు, సెక్యూరిటీ గార్డులు, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ మే 2వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పింది. అయితే కార్మికుల దినోత్సవం మే 1వ తేదీన సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో బీజేపీ కర్ణాటక ఎన్నిలక మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేశారు.
ఈ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలాగా మేము తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చెయ్యలేమని. మేము చేసే పనులనే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలు వివరించామని అన్నారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ప్రజల అభిప్రాయాలు సేకరించి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
* బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని బీజేపీ నాయకులు చెప్పారు.
* బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతిరోజు ఉచితంగా అర్దలీటర్ నందిని పాలు అందిస్తామని అన్నారు.
* ప్రతినెల 5 కేజీల సిరిధాన్యాలు ఉచితంగా అందిస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇచ్చింది.
* అటల్ బిహారి వాజ్ పేయి పేరుతో ప్రతివార్డులో ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం, టిఫిన్లు అందిస్తామని అన్నారు.

* ఇళ్లులేని నిరుపేదలకు పక్కా ఇండ్లు క్టిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు.
* సామాజిక న్యాయ నిధి పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళల పేరుతో రూ. 10,000 ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
* సీనియర్ సిటిజన్లకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్యపరీక్షలు చేయిస్తామని, అందుకు అయ్యే ఖర్చు బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు.
కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ లు కర్ణాటకలోని ప్రతి నియోజక వర్గం తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరించారని, జాతీయ స్థాయిలోని 19 మంది నాయకుల ప్రత్యేక టీమ్ తో చర్చించి తాము ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మాట్లాడారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications