543 స్థానాలకు గాను 297 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపి
ఏప్రిల్ 11 నుండి ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి ఇప్పటి వరకు మొత్తం ఆరు జాబితాల్లో 297 మంది అభ్యర్థులను ప్రకటించింది.
మొదటి విడత నామినేషన్ల గడువు సోమవారం ముగియనుండడంతో బిజేపి దేశవ్యాప్తంగా మొత్తం 297 స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది..దీంతొ మొదటి రెండు విడతల్లో జరిగే నియోజకవర్గాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించారు.. కాగా బిజేపి ప్రకటించిన మొత్తం 297 స్థానాల అభ్యర్థుల్లో ప్రధాని మోడి తోపాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్లు కూడ ఉన్నాయి.కాగా మోడి వారణాసి నుండి అమిత్ షా గాంధినగర్ నుండి పోటి చేస్తున్న విషయం తెలిసిందే,

ఈనేపథ్యంలోనే బిజేపి గురువారం విడుదల చేసిన మొదటి జాబితాలో 184 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా అదే రోజు డామన్ అండ్ డయ్యు ప్రాంతాలకు కూడ అభ్యర్థులను ప్రకటించింది.కాగా మరో మూడు జాబితాలను శుక్రవారం ప్రకటించింది.కాగా మొత్తం 543 స్థానాలకు గాను 297 మంది పార్టీ అభ్యర్థుల జాబిత ప్రకటించింది బీజేపి
ఏప్రిల్ 11 నుండి ప్రారంభం కానుండగా చివరి విడత ఎన్నికలు మే 19 న జరగనున్నాయి..మే 23 న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications