లైసెన్స్ లేకుండా బస్సు నడిపిన మంత్రి, చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
లక్నో: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బస్సు నడిపిన ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజాం ఖాన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని బుధవారం బేజీపీ డిమాండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ విషయంపై మౌనంగా ఉండటం 'ఏమి చేయలేని నిస్సహాయతను చూపిస్తుంది' అని బీజేపీ నేత విజయ్ బహుదూర్ పాఠక్ అన్నారు.
విద్యార్ధులు, ప్రయాణీకులతో ఉన్న బస్సును వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బాధ్యతా రహితంగా ఓ మంత్రి ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ ప్రభుత్వం మాట్లడపోవడం చేతగాని తనమే అవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల అజాం ఖాన్ తన స్వగ్రామమైన రాంపూర్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణాకు చెందిన బస్సును డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపారు. జిల్లా అధికారుల సమక్షంలో విద్యార్ధులు తమ జీవితాలను పణంగా పెట్టారని బీజేపీ నేత పాఠక్ అన్నారు.












Click it and Unblock the Notifications