కాంగ్రెసు చీలికపై ఆశ: ఢిల్లీపై పీఠంపై కన్నేసిన బిజెపి
బిజెపి జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా, ఢిల్లీ శాఖాధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ నియామకం జరిగిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో వేగం పెరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై అమిత్ షా పార్టీ నాయకులను సంప్రదించే అవకాశాలున్నాయి.
అయితే, తమ పార్టీ శాసనసభ్యుల్లో చీలిక రాదని ఢిల్లీ కాంగ్రెసు చీఫ్ అర్విందర్ సింగ్ అంటున్నారు. అయితే, బిజెపి నాయకులకు, కాంగ్రెసు శాసనసభ్యులకు మధ్య అనధికారిక చర్చలు జరిగినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కాంగ్రెసు చీలిక గ్రూప్ మద్దతు ఇస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. బిజెపి ఢిల్లీ శాఖ ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా ఉంది. దీంతో తాము అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే వచ్చే జనవరి వరకు రాష్ట్రపతి పాలన పొడిగించే అవకాశం ఉందని బిజెపి నాయకులు అంటున్నారు.