ప్రతిపక్ష నాయకుడు గెలుస్తారని మోదీకి, అమిత్ షాకు షాక్ ఇచ్చిన బీజేపీ లేడీ ఎంపీ !
బెంగళూరు/బెళగావి/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని బీజేపీ మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను ఓడించాలని బీజేపీ జాతీయ స్థాయి నాయకులు అందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలో జగదీష్ శెట్టర్ ఓటమికి స్వయంగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, ఉత్దరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అందరూ ఆ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒకేఒక ఏరియా హుబ్బళి,

హుబ్బళిలో జగదీష్ శెట్టర్ ను గెలిపించుకోవాని స్వయంగా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ అక్కడ ఎన్నిక ప్రచారం చేశారు. జగదీష్ శెట్టర్ కు వ్యతిరేకంగా బీజేపీలోని టాప్ సీనియర్ లీడర్స్ అందరూ దాదాపుగా అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. బుధవారం జగదీష్ శెట్టర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
జగదీష్ శెట్టర్ ఓటమిని కోరుకుంటున్న బీజేపీ హైకమాండ్ కు అదే పార్టీకి చెందిన లేడీ ఎంపీ మంగళ అంగడి షాక్ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కచ్చితంగా విజయం సాధిస్తారని బీజేపీ ఎంపీ మంగళ అంగడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ లేడీ ఎంపీ మంగళ అంగడి ఎవరో కాదు, కేంద్ర మాజీ రైల్వే శాఖా మంత్రి దివంగత సురేష్ అంగడి సతీమణి. ప్రస్తుతం మంగళ అంగడి బీజేపీ ఎంపీ. బుధవారం హుబ్బళిలోని విశ్వేశ్వరయ్య నగర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన బీజేపీ ఎంపీ మంగళ అంగడి మీడియాతో మాట్లాడుతూ కచ్చితంగా జగదీష్ శెట్టర్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడంతో బీజేపీ నాయకులు బిత్తరపోయారు.
అయితే బెళగావిలో 13 నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ లేడీ ఎంపీ మంగళ అంగడి అన్నారు. జగదీష్ శెట్టర్ ను ఓడించి అక్కడి బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయను గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నాయకులకు అదే పార్టీకి చెందిన ఎంపీ మంగళ అంగడి షాక్ ఇవ్వడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications